మాచాపూర్‌లో హైనా కలకలం | Sakshi
Sakshi News home page

మాచాపూర్‌లో హైనా కలకలం

Published Sat, May 25 2024 5:25 PM

మాచాపూర్‌లో హైనా కలకలం

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మాచాపూర్‌ హైనా దాడులు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం హైనా దాడిలో 65 జీవాలు మృతి చెందిన ఘటన మరువక ముందే శనివారం గ్రామానికి చెందిన రేగుల బాలయ్య, ఏదుల్ల మోహన్‌రెడ్డి పశువుల పాకలపై దాడి చేసి రెండు గేదె పిల్లలు (దూడలు)ను హత మార్చింది. దీంతో రైతులు బోరున విలపించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బుచ్చయ్య అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో రాత్రి బోన్‌లు, ఫ్లాష్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రెండు దూడలు మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement