లక్షకు పైగా బైక్లే... క్రమంగా పెరుగుతున్న కార్లు, ఆటోలు
పెట్రోలు బంకుల్లో బారులు తీరవలసిన అవసరం లేదు. ఇంధనం కోసం ప్రతి రోజు రూ.వందల్లో వెచ్చించవలసిన పనిలేదు. రాత్రిపూట ఓ ఐదారు గంటలు చార్జింగ్ చేస్తే చాలు పగలంతా హాయిగా మీ వాహనాలపై పరుగులు తీయొచ్చు. అందుకే సిటీజనులు ఇప్పుడు ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్స్) వైపు చూస్తున్నారు. దీంతో కొంతకాలంగా నగరంలో ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇంధనభారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నా రు. ఒకసారి చార్జింగ్ చేస్తే కనీసం 60 నుంచి వంద కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయం ఉన్న వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్ ఆధారిత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు.