ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం

Published Wed, Nov 15 2023 1:30 AM

మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌ - Sakshi

వేములవాడరూరల్‌/చందుర్తి: కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఏర్పడగానే ఆరు పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం బాలరాజుపల్లి, వెంకటాంపల్లి, ఎదురుగట్ల, అచ్చన్నపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత ముప్పై ఏళ్లుగా మీ మధ్యనే ఉన్న మీ ఇంటి బిడ్డగా వస్తున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆరు గ్యారంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిందని.. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామన్నారు. మాజీ ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్‌, వకుళాభరణం శ్రీనివాస్‌, చంద్రగిరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఆది’కి మద్దతుగా సీసీఐ నాయకుల ప్రచారం

ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా చందుర్తి మండలం బండపల్లిలోని ఒడ్డెరకాలనీలో సీపీఐ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి రాములు, పట్టణ కార్యదర్శి దేవరాజ్‌ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు మంగళవారం ప్రచారం చేశారు. ఆది శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కోరె క్రాంతి, పెంట మల్లయ్య, పండుగ చంద్రయ్య పాల్గొన్నారు.

వేములవాడలో ఆది వనజ ప్రచారం

వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ సతీమణి ఆది వనజ మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహిళలకు బొట్టుపెట్టి ఓటును అభ్యర్థించారు. నాలుగుసార్లు ఓడినప్పటికీ స్థానికంగానే ఉంటూ సేవలందించారని.. ఈసారి గెలిపించాలని కోరారు.

ఆరు పథకాలు అమలు చేస్తాం

వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌

బొట్టుపెట్టి ఓటు అభ్యర్థిస్తున్న   ఆది శ్రీనివాస్‌ సతీమణి ఆది వనజ
1/1

బొట్టుపెట్టి ఓటు అభ్యర్థిస్తున్న ఆది శ్రీనివాస్‌ సతీమణి ఆది వనజ

Advertisement
Advertisement