పీజీ సెట్‌లో ప్రదీప్‌కు 20వ ర్యాంకు | Sakshi
Sakshi News home page

పీజీ సెట్‌లో ప్రదీప్‌కు 20వ ర్యాంకు

Published Tue, Nov 14 2023 1:44 AM

తల్లిదండ్రులతో డాక్టర్‌ ప్రదీప్‌ సుందర్‌రెడ్డి   - Sakshi

ఒంగోలు టౌన్‌: ఢిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన ఐఎన్‌ఐసెట్‌ పీజీ పరీక్షల్లో ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మధుకిరణ్‌ రెడ్డి కుమారుడైన డా.ప్రదీప్‌ సుందర్‌ రెడ్డి ఆలిండియా స్థాయిలో 20వ ర్యాంకు సాధించారు. ప్రదీప్‌ పాండిచ్చేరి జిప్‌మర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తండ్రి ఒంగోలులో కిరణ్‌ న్యూరో అండ్‌ ఆర్థో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్వహిస్తున్నారు. తల్లి డాక్టర్‌ జి.భగీరథ దేవి జిల్లా మెడికల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో 20వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్‌ తెలిపారు. చంఢీఘర్‌లో జనరల్‌ మెడిసిన్‌ పీజీ చేయాలని ఉందన్నారు. తలిదండ్రుల ప్రోత్సాహం వల్లనే తాను పీజీలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించగలిగానని ప్రదీప్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించిన ప్రదీప్‌కు పట్టణానికి చెందిన వైద్యులు, కిరణ్‌ న్యూరో అండ్‌ ఆర్థో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement