పునరావాస కేంద్రాలను గుర్తించండి: పీఓ విష్ణుచరణ్‌ | Sakshi
Sakshi News home page

పునరావాస కేంద్రాలను గుర్తించండి: పీఓ విష్ణుచరణ్‌

Published Tue, Dec 5 2023 4:58 AM

లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న 
ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్‌  - Sakshi

సాలూరు: మిచాంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను గుర్తించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అత్యవసరమైతే తరలించాలని ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్‌ ఆదేశించారు. పట్టణంలోని చినహరిజనపేట, రామాకాలనీలోని లోత ట్టు ప్రాంతాలను పరిశీలించారు. చెరుకుపల్లి గెడ్డ వరద ఉద్ధృతిపై ఆరా తీశారు. మామిడిపల్లి, శివరాంపురం తదితర ప్రాంతాల్లో వరద ఉద్ధృతి, పాచిపెంట మండలంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల సన్నద్ధతపై అధికారులకు సూచనలు చేశారు. వాగులు పొంగి, రోడ్లపై వరదనీరు ప్రవహించిన సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నయ మార్గాలను సిద్ధంచేయా లన్నారు. అత్యవసర వేళ పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ బాలమురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, ఎంపీడీఓ పార్వతి, తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement