కృష్ణా తీరంలో ప్రారంభమైన వజ్రాల వేట | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరంలో ప్రారంభమైన వజ్రాల వేట

Published Sun, May 26 2024 6:50 AM

కృష్ణా తీరంలో ప్రారంభమైన వజ్రాల వేట

నందిగామ: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాలను అన్వేషించేందుకు అనేక ప్రాంతాల నుంచి వజ్రాల అన్వేషకులు చందర్లపాడు మండలం గుడిమెట్ల ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా వర్షాకాలం ఆరంభం నుంచే వజ్రాల వేట మొదలవుతుంది. ప్రస్తుతం కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండ డంతో వేసవిలో సైతం వజ్రాల వేట కొనసాగు తోంది. ముఖ్యంగా శనివారం అనేక ప్రాంతాల నుంచి గుడిమెట్ల అటవీ ప్రాంతానికి వజ్రాలు అన్వే షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement