బంగారు తాపడం పనులకు విరాళం | Sakshi
Sakshi News home page

బంగారు తాపడం పనులకు విరాళం

Published Fri, May 24 2024 9:15 AM

బంగారు తాపడం  పనులకు విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు గురువారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌ మేడ్చల్‌ చెంగిచర్లకు చెందిన అనంతాల శంకర్‌ గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కేఎస్‌ రామరావును కలిసి బంగారు తాపడం పనులకు విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈవో రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement