నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

Published Sun, May 26 2024 8:00 AM

నకిలీ

డిచ్‌పల్లి : విత్తన దుకాణాల డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్ప వని నిజామాబాద్‌ రూరల్‌ ఏడీఏ ప్రదీప్‌ హెచ్చరించారు. శనివారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి రైతు వేదికలో డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి మండ లాలకు చెందిన విత్తన దుకాణాల డీలర్లకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ.. డీలర్లు రైతులకు విధిగా రశీదు ఇవ్వాలని, వి త్తన లైసెన్స్‌ వివరాలు, ధరల పట్టిక ఏర్పాటు చే యాలని సూచించారు. అలాగే విత్తనాలు కొనుగో లు చేసిన రైతుల వివరాలను రోజూవారిగా రిజిస్టర్‌ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు రాంబా బు, దేవిక, ఏఈవోలు, ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.

రైతుల వివరాలు నమోదు చేయాలి

నిజామాబాద్‌ రూరల్‌ : విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు తమ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చే యాలని ఏవో జాదవ్‌ హీరా ఆదేశించారు. నిజామాబాద్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మో పాల్‌, రూరల్‌ డీలర్లు, సొసైటీ సీఈవోలతో శనివా రం ఆమె సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనా లు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
1/1

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement