![‘గజ్జలమ్మ’కు పూజలు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/27/26mdl104r-340036_mr.jpg.webp?itok=h7i-rAOh)
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేష్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, పల్లకి సేవ నిర్వహించారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కడార్ల హరిప్రసాద్, బోయ సాయిలు, గట్టుపల్లి శ్రీనివాస్, తాటి శివ, చిప్ప సంజీవ్, గంగాధర రాజు, పల్లికొండ గజేందర్, భూమన్న, గజేందర్, తదితరులు పాల్గొన్నారు.