సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Published Sat, May 25 2024 12:00 AM

సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

నిర్మల్‌ రూరల్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష నిర్వహించారు. ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 1214 మంది విద్యార్థులకు 1116 మంది హాజరయ్యారు. జనరల్‌ కేటగిరీలో 1,010 మందికి 930 మంది హాజరవగా, 80 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరీలో 204 మందికి 186 మంది హాజరవగా 18 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్‌లో మొత్తం 438 మంది విద్యార్థులకు 401 మంది హాజరయ్యారు. జనరల్‌ కేటగిరీలో 365 మందికి 333 మంది హాజరయ్యారు. 32 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరీలో 73 మందికి 68 మంది హాజరవగా ఐదుగురు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కే ంద్రాన్ని డీఐఈవో పరశురాం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement