దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 44,281 కరోనా కేసులు

Published Wed, Nov 11 2020 10:46 AM

Corona Update: New 44281 Positive Cases Reported In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 44,281 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,36,011కు చేరాయి. కొత్తగా 512 మంది మృత్యువాతపడగా, ఇప్పటి వరకు 1,27,571 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కరోనాపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 4,94,657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు  80,13,783 మంది కోలుకున్నారు. మరణాల శాతం 1.48% గా ఉంది. రికవరరీ రేటు 92.79గా ఉంది. చదవండి: కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్‌ పాత్ర

చదవండి: కరోనా ఎఫెక్ట్‌: పెళ్లి ఆలోచన పెరిగింది..

Advertisement
Advertisement