ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడిపై దాడి | Sakshi
Sakshi News home page

ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడిపై దాడి

Published Thu, Nov 16 2023 6:06 AM

-

ఆరుగురిపై కేసు నమోదు

కోదాడరూరల్‌: ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడిపై దాడి చేసిన పలువురిపై పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోదాడ పట్టణ పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఎగ్జిబిషన్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం రాత్రి పట్టణానికి చెందిన గుండు రాహుల్‌, నీలేష్‌, శివలతో పాటు మరో ఇద్దరు అక్కడకు వెళ్లి టికెట్‌ తీసుకోకుండా లోపలికి పంపించాలని నిర్వాహకులతో గొడవకు దిగారు. దీంతో వారు లోపలికి అనుమతించకపోవడంతో నిర్వాహకుడైన జాల వెంకటేశ్వర్లును దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. అదే విధంగా ఆ ఐదుగురు యువకులకు సంబంధించిన మరో వ్యక్తి నిర్వాహకుడిని కులం పేరుతో దూషించాడు. ఈ సంఘటనపై బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాము తెలిపారు.

Advertisement
Advertisement