కన్నాయిగూడెం: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూప్రకారం ఆహారం అందించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని గిరిజర సంక్షేమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులకు జీసీసీ ఆధ్వర్యంలో అందింస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాల పెంపునకు కావాల్సిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్ఎం సంతోష్, వెంకన్న, నరేష్, సత్యం, శ్రీనివాస్, రామారావు, పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు
డిప్యూటీ డైరెక్టర్ పోచం