వేతన వెతలు! | Sakshi
Sakshi News home page

వేతన వెతలు!

Published Sat, May 25 2024 6:05 PM

వేతన వెతలు!

చిన్నశంకరంపేటలో రోడ్డును శుభ్రం చేస్తున్న కార్మికులు

చిన్నశంకరంపేట(మెదక్‌): ఆరు నెలలుగా వేతనాలు రాక పారిశుధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. పస్తులుండి పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వాపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు నిలిపివేసిన కార్మికులు వేతనం కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

జిల్లాలో 1,710 మంది విధులు

జిల్లాలో 1,710 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒకొక్కరికి రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.8,500 అందజేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి ఎనిమిది మంది వరకు పనిచేస్తున్నారు. పారిశుధ్య పనులతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు ట్రాక్టర్‌ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. మరో వైపు మొక్కలకు నీరు పెట్టడం, నల్లా నీరు వదలడం లాంటి పనులు చేస్తున్నారు. అయితే సకాలంలో వేతనాలు రాకపోవడంతో కొంత మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు వేతనాలు అందించి పనులు సజావుగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పారిశుధ్య

కార్మికులకు తప్పని తిప్పలు

Advertisement
 
Advertisement
 
Advertisement