నర్సాపూర్ రూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి భారతి హొళికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మార్కెట్తో పాటు మండలంలోని కాగజ్ మద్దూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదనంగా లారీలను ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని సూచించారు. ధాన్యంలో తేమశాతం లేకుండా తూకం వేయాలన్నారు. రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కాగజ్ మద్దూర్ కొనుగోలు కేంద్రంలో 8,000 వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని.. మూడు రోజులకు ఒక లా రీని పంపుతున్నారని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అదనంగా లారీలను పంపించాలని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ బ్రహ్మారావు, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి ఆర్ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.