శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024
ప్రైవేట్
పాఠశాలల
ఇష్టారాజ్యం
మెదక్జోన్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో జిల్లాలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
జిల్లాలో 220 ప్రైవేట్ బడులు
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 220 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో నర్సరీకి ఫీజు రూ.19,000, అడ్మిషన్ ఫీజు రూ.1,000, షూ, యూనిఫాంకు కలిపి రూ.5 వేలు మొత్తంగా రూ.25,000 వసూలు చేస్తున్నారు. ఎల్కేజీకి ఫీజు రూ.28,000, యూకేజీ రూ.29,500, 6వ తరగతికి రూ.36 వేలు, 7వ తరగతి రూ.40 వేలు, 10వ తరగతికి రూ.62 వేలు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా అదే పాఠశాలలో హాస్టల్లో ఉంటే ఏడాదికి రూ.40 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
అమలు కాని విద్యాహక్కు చట్టం!
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు వసూలు చేయొద్దు. కానీ జిల్లాలో రూ. వెయ్యి నుంచి మొదలుకుని రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించాలనే నిబంధన ఉంది. దానిని అమలు చేసిన దాఖలాలు లేవు. 2020లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయినా అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాకుండా యూనిఫామ్స్, పుస్తకాలు, షూ ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల నిర్వాహకులు విక్రయించొద్దనే నిబంధన ఉంది. అయినా ఇవేమి పట్టించుకోవడం లేదు. ఏకంగా పాఠశాలల్లోనే విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఇటీవల పలు సంఘాల నాయకులు అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. అన్నివర్గాల పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యూస్రీల్
చర్యలు తప్పవు
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేస్తామని చాలాకాలంగా చెబుతోంది. ఈ ఏడాది సైతం ఆ అంశం ప్రస్తావనకు వచ్చి ంది. ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు.
– రాధాకిషన్, డీఈఓ మెదక్