● గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న
జన్నారం: వచ్చే ఎన్నికల్లో ఓటు కోసం వచ్చే అభ్యర్థులను గల్ఫ్ సమస్యలపై నిలదీయాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గల్ఫ్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ విస్మరించిందని ఆరోపించారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేసినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం, ప్రతి పక్షాలను గల్ఫ్ సమస్యలపై వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అమరగొండ తిరుపతిగౌడ్, గౌరవాధ్యక్షుడు సేపూరి గోపాల్, ప్రచార కా ర్యదర్శి మహ్మద్ హసన్, సలహాదారు మగ్గిడి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య, నాయకులు నరేశ్, తిరుపతి, అంజన్న, రాజేశ్ తదితరులున్నారు.