రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

Published Sat, Nov 11 2023 12:42 AM

-

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం దొనబండ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడిపేటకు చెందిన దుర్గం మారుతి (26) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపేటకు చెందిన దుర్గం మారుతి తన బైక్‌పై లక్సెట్టిపేటలోని జెండా వెంకటపూర్‌లోగల అత్తగారింటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో దొనబండకు చేరుకోగా మంచిర్యాల వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతి తీవ్రంగా గాయపడ్డాడు. కాలు తెగి దూరాన ఎగిరిపడింది. చేయి విరిగింది. తలకూ గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

వాహనం బోల్తాపడి బీఎస్పీకార్యకర్తలకు..

సిర్పూర్‌(టి): మండలకేంద్రంలో నిర్వహించిన బీఎస్పీ నామినేషన్‌ కార్యక్రమానికి వస్తున్న పార్టీ కార్యకర్తలు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. సిర్పూర్‌(టి)–పెద్దబండ గ్రామాల మధ్య కాగజ్‌నగర్‌ వైపు నుంచి వస్తున్న బొలేరో ట్రాలీ ప్రమాదవశాత్తు బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న సుమారు 25 మంది బీఎస్పీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు, బీఎస్పీ నాయకులు మండలకేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌ పట్టణానికి తరలించారు.

బాస్కెట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు

భైంసా: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌కు బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపా రు. యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ తిరువనంతపురం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికై న వి ద్యార్థులకు అన్ని విధాలుగా సహకరిస్తామని డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement