ఆసిఫాబాద్అర్బన్: రానున్న పార్లమెంట్ ఎ న్నికల్లో ప్రజా, రైతు వ్యతిరేక ప్రభుత్వాలను ఓడించాలని వామపక్షాల నేతలు పిలుపుని చ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. కేంద్రంలోనిని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో అన్ని రంగాలను నిర్వీర్యం చే సిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తూ పరిపాలన కొనసాగించిందని విమర్శించారు. అన్ని రంగాలను ప్రై వేట్ పరం చేసిందని తెలిపారు. ఉద్యోగాలు లేక దేశంలోని 80శాతం నిరుద్యోగుల భవిష్య త్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. నాయకులు సత్యనారాయణ, చాంద్పాషా, దినకర్. ప్రశాంత్, కార్తీక్, టీఖానంద్, శ్రీనివాస్, లచ్చన్న, మల్లన్న, పో షన్న, సాగర్, మాలశ్రీ, తిరుపతి ఉన్నారు.