Sakshi News home page

కార్మికులందరికీ ఇన్సెంటివ్‌ చెల్లించాలి

Published Wed, Apr 17 2024 1:50 AM

మేనేజర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
 - Sakshi

నస్పూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌ గని కార్మికులందరికీ ఇన్సెంటివ్‌ చెల్లించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కే.బాజీసైదా అన్నారు. ఓపెన్‌ కాస్ట్‌ గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మేనేజర్‌ బ్రహ్మాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ఓసీపీ, సీహెచ్‌పీ రెండూ కలిసి ఒకేచోట ఉండడం వల్ల కార్మికులకు ఇ న్సెంటివ్‌ రావడం లేదని, వీటిని రెండు భాగాలుగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, బద్రి బుచ్చయ్య, ఫిట్‌ కార్యదర్శి మోతె లచ్చన్న, నాయకులు గునిగంటి నర్శింగ్‌, అప్రోజ్‌ఖాన్‌, రాజయ్య, నాగేశ్వర్‌రావు, సత్తయ్య పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement