Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Wed, Mar 27 2024 12:05 AM

-

‘బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి’

దహెగాం: బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్‌, బీఎస్పీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ బీఆర్‌ఎస్‌లో చేరారని, ఈ నెల 28న కాగజ్‌నగర్‌ పట్టణానికి వస్తున్నారన్నారు. భారీగా కార్యకర్తలు తరలిరావాలని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. షాకీర్‌, ఎల్కరి ప్ర శాంత్‌, బాలు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలకు 37 మంది గైర్హాజరు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం నిర్వహించిన పరీక్షకు 6,425 మంది విద్యార్థులకు 6,388 మంది హాజరు కాగా.. 37 మంది గైర్హాజరయ్యారని డీఈవో అశోక్‌ తెలిపారు. ఇందులో ప్రైవేట్‌గా ఫీజులు చెల్లించి 97 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఈవో తనిఖీ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement