● శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

● శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Published Tue, May 14 2024 10:55 AM

● శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ పాఠశాల విద్యార్థులు సీబీఎస్‌ఈ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య వెల్లడించారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించిన వారు మాట్లాడుతూ 500మార్కులకు ఎస్‌.మనోన్మయి 491మార్కులు, జి.తన్మయి 483, ఎన్‌.నిఖిత 483, వి.కీర్తి 481, వి.వర్షిత్‌ 480, ఎస్‌.మధు సన్షిత 479మార్కులు సాధించారన్నారు. నూరు శాతం ఫలితాలతో 30మంది విద్యార్థులు 450మార్కులకుపైగా సాధించారని చెప్పారు. విద్యార్థులను చైర్మన్‌, డైరెక్టర్‌తో పాటు డైరెక్టర్‌ సాయి గీతిక, ఏజీఎం చేతన్‌ మాథుర్‌, కోఆర్డినేటర్‌ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు టీఎల్‌ఎన్‌.శర్మ, నాగప్రవీణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌, డీన్‌ లక్ష్మీనర్సింహ, ఇన్‌చార్జ్‌లు రామారావు, నరేష్‌, సతీష్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement