సౌకర్యాల కల్పనలో వేగం పెంచండి | Sakshi
Sakshi News home page

సౌకర్యాల కల్పనలో వేగం పెంచండి

Published Wed, Nov 15 2023 12:20 AM

- - Sakshi

నేలకొండపల్లి: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నందున జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని జిల్లా ఎన్నికల నోడల్‌ అధి కారి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ గండికోట చంద్రమౌళి ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. నేలకొండపల్లి పోలింగ్‌ కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ డీఈఈ వేణుగోపాల్‌, నేలకొండపల్లి ఏఈ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వ హించారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు జరిపించారు.

Advertisement
Advertisement