Sakshi News home page

ఒలింపియాడ్‌లో ‘పారమిత’ ప్రతిభ

Published Wed, Apr 17 2024 1:40 AM

విద్యార్థులను అభినందిస్తున్న విద్యాసంస్థల డైరెక్టర్లు - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్‌ పాఠశాల విద్యార్థులు ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచి, అవార్డులు కై వసం చేసుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు రితేశ్‌ మెహతా తెలిపారు. గణితంలో వెల్ది హర్షిణి(ఏడోతరగతి) 2వ ర్యాంకు, జొన్నల సాయిరిషిత్‌(ఏడోతరగతి) 5వ ర్యాంకు, జీకే విభాగంలో భవిక్‌(ఆరోతరగతి) 3వ ర్యాంకుతోపాటు మరో 16 మంది విద్యార్థులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారని పేర్కొన్నారు. వారిని పారమిత విద్యాసంస్థల చైర్మన్‌ ఇ.ప్రసాదరావుతోపాటు డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌రావు, రశ్మిత, రాకేశ్‌, వి.యు.ఎం.ప్రసాద్‌, వినోద్‌రావు, ప్రోగ్రాం హెడ్‌ గోపీకృష్ణ, కో–ఆర్డినేటర్‌ రాము, గైడ్‌ టీచర్లు ప్రదీప్‌కుమార్‌, సంధ్యారాణి, అంజిరెడ్డి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.

Advertisement
Advertisement