Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Published Wed, Apr 17 2024 1:35 AM

-

కరీంనగర్‌క్రైం: రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 14వ తేదీన రాజీవ్‌చౌక్‌ మార్గంలో ఒక వ్యక్తి స్పృహతప్పి కింద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వచ్చి అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 50 ఏళ్ల వరకు ఉంటుందని, అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో ఉంచినట్లు తెలిపారు.

Advertisement
Advertisement