యువకులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే | Sakshi
Sakshi News home page

యువకులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే

Published Thu, Apr 18 2024 10:20 AM

పార్టీలో చేరిన చేరిన బైరాపూర్‌ యువకులతో బీబీ పాటిల్‌, అరుణతార  - Sakshi

బాన్సువాడ: యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ అన్నారు. బుధవారం బైరాపూర్‌ గ్రామానికి చెందిన యువకులు బీబీ పాటిల్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతుందంటే కారణం యువకులేనని అన్నారు. యువకులు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మోదీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో యువకులు బీజేపీకి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార, బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్‌, తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement