రూ.12.89లక్షల కుచ్చుటోపీ | Sakshi
Sakshi News home page

రూ.12.89లక్షల కుచ్చుటోపీ

Published Sat, May 25 2024 6:00 PM

-

మెటీరియల్‌ సరఫరా చేస్తానని..

మహారాష్ట్రలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

పరారీలో మరో నలుగురు నిందితులు

కుత్బుల్లాపూర్‌: పరిశ్రమ నిర్వాహకుడి నుంచి నగదు తీసుకుని మెటీరియల్‌ సరఫరా చేయకుండా మోసం చేసిన వ్యక్తికి మేడ్చల్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లిలో ఓ వ్యక్తి జేపీ కెమ్‌ కార్పొరేషన్‌ పేరుతో పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ బారూచ్‌కు చెందిన పటేల్‌ భావిన్‌భాయ్‌(42), భరత్‌, కుందన్‌, జయేష్‌, హిరన్‌లు జేపీ కెమ్‌ కార్పొరేషన్‌ యజమానిని కలిసి తాము మెటీరియల్‌ అందజేస్తామని నమ్మబలికారు. దీంతో అతడు బావిన్‌భాయ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు మే 8వ తేదీన రూ.12,89,956 నగుదును ట్రాన్స్‌ఫార్మర్‌ చేశారు.

● అయితే భావిన్‌భాయ్‌ మెటీరియల్‌ను సరఫరా చేయకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పేట్‌బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరం కాష్‌మిరా పోలీస్‌స్టేషన్‌ లిమిట్స్‌లో ఈనెల 22న భావిన్‌భాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.8లక్షల నగదును రికవరీ చేశారు. కాగా మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న భావిన్‌భాయ్‌ను మేడ్చల్‌ కోర్టులో ప్రవేశించగా రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement