పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

Published Sun, May 26 2024 7:20 AM

పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

కాళోజీ సెంటర్‌ : పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై డీఈఓ వాసంతి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, పాటు సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 459 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధ్ది పనులు చేపట్టగా.. 131 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పాఠశాలల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. సమీక్షలో ఇంజనీరింగ్‌ అధికారులు సంజయ్‌కుమార్‌, రవికిరణ్‌, సారంగం, రంగారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement