సీఎం సహాయ నిధి ద్వారా రూ.12.65 లక్షల సాయం | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధి ద్వారా రూ.12.65 లక్షల సాయం

Published Sun, Nov 19 2023 1:40 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 
అందజేస్తున్న హోం మంత్రి తానేటి వనిత 
 - Sakshi

కొవ్వూరు: వైద్య సహాయం నిమిత్తం జిల్లాలోని జిల్లాలోని ఏడుగురు రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.12.65 లక్షల ఆర్థిక సాయం విడుదలైంది. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి లబ్ధిదారులకు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెక్కులు పంపిణీ చేశారు. కుసులూరి విజయలక్ష్మికి రూ.65 వేలు, కుక్కల సింహాచలానికి రూ.65 వేలు, మాసా వీర్రాజుకు రూ.2 లక్షలు, గుత్తుల నాగరాజుకు రూ.లక్ష , గాడా పుష్పకు రూ.6.50 లక్షలు, కర్రి రాంబాబుకు రూ.1.50 లక్షలు, కోమలి ఝాన్సీకి రూ.35 వేల చొప్పున చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉప్పులూరి సూరిబాబు, తోట నారాయణ, పుసులూరి రామకృష్ణ, దేవగుప్తాపు లక్ష్మణరావు, నేతల వెంకటేష్‌, యజ్జల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు అందజేసిన మంత్రి వనిత

Advertisement
Advertisement