జిల్లా రగ్బీ జట్ల ఎంపిక
కరప: మండలం గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్ గేమ్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 విభాగంలో బాలురు, బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. పీడీ కె.నాగలింగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలను సర్పంచ్ అనసూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గోడిలంక, జి.వేమవరం, ఇంజరం, కొమరిగిరి, తుని, ఎల్ఎన్ పురం, పిఠాపురం, మూలపేట, కరప, గురజనాపల్లి, గొర్రిపూడి, కాకినాడ నుంచి ఆదిత్య, భాష్యం పాఠశాలల క్రీడాకారులు ప్రతిభ చూపి జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఈ జట్లు కర్నూలులో ఈ నెల 17 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ నాగలింగేశ్వరరావు తెలిపారు. ఎంపీటీసీ వై.వీరవేణి, ఎస్ఎంసీ చైర్మన్ పి.వీరబాబు, హెచ్ఎం ఎ.సాయిమోహన్, వివిధ మండలాల జోన్ అధ్యక్షులు వి.మాచర్రావు, వి.హరిబాబు, ఆర్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.