వదంతులు నమ్మవద్దు
కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు నమ్మవద్దని రోడ్డు కం రైలు బ్రిడ్జి (ఆర్సీఆర్బీ) డీఈఈ బీవీ మధుసూదనరావు వెల్లడించారు. మరమ్మతుల కోసం ఈ నెల పదో తేదీ వరకు అనుమతి తీసుకున్నామని, వాహనాల రావడం మూలంగా బ్రిడ్జిపై తాము చేపట్టే పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో మేసేజ్లు ట్రోల్ చేస్తున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి మాత్రమే బ్రిడ్జిపై వాహనాలను అనుమతించనున్నట్లు ఆయన ప్రకటించారు. బ్రిడ్జిపైకి భారీ వాహనాలు రాకుండా ఇరు వైపు గడ్డర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బ్రిడ్జి రోడ్డు మార్కింగ్, ఫుట్పాత్ల పెయింట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జాయింట్ల వద్ద మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.