Sakshi News home page

Ananatapur: మహిళా లెక్చరర్‌పై భర్త హత్యాయత్నం.. కాలేజ్‌లో ఉండగా..

Published Thu, Nov 17 2022 1:07 PM

Husband Attack On Woman Lecturer With Knife At Anantapur College - Sakshi

సాక్షి, అనంతపురం:  అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో మహిళా లెక్చరర్‌పై గురువారం హత్యాయత్నం జరిగింది. కాలేజీలో ఉన్న కామర్స్ లెక్చరర్ సుమంగళిపై ఆమె భర్త దాడి చేశారు. కత్తితో గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించారు. దీంతో విద్యార్థులు, లెక్చరర్లు గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పారిపోయేందుకు పరుగులు తీశాడు. విద్యార్థులు, కాలేజీ సిబ్బంది సాయంతో పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర గాయాలైన మహిళా లెక్చరర్ సుమంగళిని హుటాహుటినా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే  కుటుంబ కలహాల కారణంగా మహిళా లెక్చరర్‌పై భర్త హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  భర్తతో విభేదాల కారణంగా ఆమె కోర్టులో విడాకుల కేసు వేశారు. ఈ కేసు కోర్టులో ఉండగానే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు.

చదవండి: చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు

Advertisement

What’s your opinion

Advertisement