స్టాక్‌ మార్కెట్‌లో ఊగిసలాట.. ముందుకి వెనక్కి కదులుతున్న సూచీలు

Daily Stock Market Updates In Telugu - Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో మరోసారి అనిశ్చిత్త పరిస్థితి నెలకొంది. ఉదయం మార్కెట్‌ ప్రారంభంలో బుల్‌ జోరు కనిపించింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు ఏషియా మార్కెట్లలో సూచీలు నెమ్మదిగా కదులుతున్నాయి. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60,997 పాయింట్లతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపించడంతో ఒక్కసారిగా పైకి దూసుకెళ్లి 400లకు పైగా పాయింట్లు లాభపడింది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 గంటల సమయంలో 143 పాయింట్లు లాభపడి 61,493 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 18,322 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top