Sakshi News home page

‘పది’ పరీక్షకు 97 మంది గైర్హాజరు

Published Fri, Mar 29 2024 12:35 AM

-

కొత్తగూడెంఅర్బన్‌: పదో తరగతి పరీక్షలు ఆరో రోజు గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్‌ విద్యార్థులు 12,341 మందికి 12,291 మంది, ప్రైవేటు విద్యార్థులు 375 మందికి 328 హాజరయ్యారని, మొత్తంగా 97 మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి వివరించారు. తాను నాలుగు కేంద్రాలను, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 18 సెంటర్లలో తనిఖీ చేశాయని పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కాగా, కాచనపల్లి కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ను, డిప్మార్ట్‌మెంటల్‌ అధికారిని తప్పించామని, వారి బదులు ఇతరులను నియమించామని వెల్లడించారు.

Advertisement

What’s your opinion

Advertisement