ఒకేరోజు 75,465 కరోనా టెస్టులు | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 75,465 కరోనా టెస్టులు

Published Sun, Sep 13 2020 4:06 AM

75465 corona diagnostic tests were performed in last 24 hours - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 24 గంటల వ్యవధిలో 75,465 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 31,255 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు, 44,210 యాంటిజెన్‌ టెస్టులు ఉన్నాయి. దీంతో శనివారం నాటికి రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45,27,593కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,901 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 10,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 67 మంది కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 5,57,587 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,57,008 మంది కోలుకోగా, మరో 95,733 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,846కు చేరింది. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 84,786 టెస్టులు చేస్తూ దేశంలో ఏపీ మొదటిస్థానంలో కొనసాగుతోంది.

Advertisement
Advertisement