హంస వాహనంపై నారసింహుడు | Sakshi
Sakshi News home page

హంస వాహనంపై నారసింహుడు

Published Sat, May 25 2024 4:35 PM

హంస వాహనంపై నారసింహుడు

ఉరవకొండ:పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం హంసవాహనోత్సవ సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు హంస వాహనంపై మాడవీధుల్లో దర్శనిమిచ్చారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హంసను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి ప్రసాదించేందుకు స్వామి వారు హంస వాహనంపై కన్పిస్తాడని పండితులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్‌, ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement