Sakshi News home page

వలంటీర్‌ను వాతలు పడేలా కొట్టారు

Published Sat, Apr 20 2024 2:00 AM

టీడీపీ వర్గీయుల దాడిలో వీపుపై పడిన వాతలు చూపుతున్న వలంటీర్‌ హర్ష (ఫైల్‌)   - Sakshi

టీడీపీ హయాంలో ప్రజలకెలాగూ మంచి చేయని పచ్చ మూకలు.. నేడు ప్రజలకు మంచి చేస్తున్న వలంటీర్లపైనా కక్షకట్టారు. దాడులకు దిగారు. యాడికి మండలంలోని పుప్పాల గ్రామంలో రజక కులానికి చెందిన వలంటీర్‌ హర్షపై 2020 డిసెంబర్‌ 1న జేసీ ప్రధాన అనుచరుడు, పుప్పాల మాజీ సర్పంచ్‌ దేవేంద్ర విచక్షణా రహితంగా దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన రాజ, ఆయన తమ్ముడు బాబు, చరణ్‌తో కలిసి కర్రలతో హర్ష వీపు, గుండైపె వాతలు పడేలా కొట్టారు. తన 50 ఇళ్ల పరిధిలోని ప్రజలకు పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే వలంటీర్‌ హర్ష చేసిన తప్పయింది. పచ్చ గూండాల అరాచకాలపై పుప్పాల గ్రామస్తులంతా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో ఉంచుకున్న గ్రామ సర్పంచు దేవేంద్ర (టీడీపీ మద్దతుదారుడు), ఆయన అనుచరులు గంగిరెడ్డి, ప్రభాకర్‌లు మళ్లీ ఇదే వలంటీర్‌ హర్షపై 2023 మే 18న రాత్రి 9 గంటల సమయంలోదాడికి దిగారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. హర్ష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement