కార్మికుడి మృతికి ఎమ్మెల్యే సంతాపం | Sakshi
Sakshi News home page

కార్మికుడి మృతికి ఎమ్మెల్యే సంతాపం

Published Mon, Apr 8 2024 1:30 AM

-

అనంతపురం కార్పొరేషన్‌: నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ వర్కర్‌ మహబూబ్‌బాషా (57) ఆదివారం తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎర్రనేలకొట్టాల్లోని మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహబూబ్‌ బాషా మృతదేహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఫయాజ్‌, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్‌, కార్పొరేటర్‌ లాలూ పాల్గొన్నారు.

Advertisement
Advertisement