డ్రైవర్కు ఐదు నెలల జైలు
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఐచర్వ్యాన్ డ్రైవర్ నీరటి రాజేందర్కు ఐదు నెలల జైలుశిక్ష విధిస్తు ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితిన్కుమార్ బుధవారం తీర్పునిచ్చారు. మూడేళ్ల క్రితం మండలంలోని బెల్లాల్ ఎక్స్రోడ్డు వద్ద ఐచర్ వ్యాన్ అజాగ్రత్తగా నడిపి ఆటోను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. సోన్ మండలం కూచన్పెల్లికి గ్రామానికి చెందిన పూదరి రాజశేఖర్ కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై కోదాడి రాజు కేసు దర్యాప్తు చేశారు. వాదోపవాదలు జరిగి బుధవారం కేసు నేరారోపణ రుజువుకు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ ఐదు నెలల జైలు శిక్ష, రూ.1500ల జరిమానా విధించారని ఎస్సై కృష్ణ సాగర్రెడ్డి తెలిపారు.