-
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
కొత్తకోట రూరల్: రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తకోటలో నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్సీటీఈ అనుమతితో ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈసీ అనుమతితో పదోన్నతులు, బదిలీలు చేట్టాలన్నారు. అంతేగాకుండా పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, జీపీఎఫ్, మెడికల్ బిల్స్, జీఎల్ఐ మెచ్యూరిటీ అయిన బండ్ల నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, గద్వాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు హరికృష్ణ, రాఘవేంద్రాచారి, అరవింద్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దేవన్న, కృష్ణ, శివనారాయణ, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు -
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
వనపర్తి: జిల్లాల రద్దు విషయమై కాంగ్రెస్ ఇస్తున్న లీకులతో మీడియాలో రోజుకో వార్త కథనం వస్తోందని.. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం, ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, ఆ తర్వాత ప్రజల జీవన విధానం మెరుగుపడిందని గుర్తించాలన్నారు. జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరో ఉద్యమం తెలంగాణలో మొదలవుతుందన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు లక్ష్మారెడ్డి, రఘుపతిరెడ్డి, మన్నెపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
కొత్తకోట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి కొత్తకోటకు వస్తున్న నేపథ్యంలో పట్టణ శివారులోని పోలీస్స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేశారో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేస్తున్నారన్నారు. పదేళ్లు పాలించిన బీజేపీ నాయకులు ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా రాముడి పేరు చెప్పుకొంటూ రాజకీయాలు చేశారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెంట కరుణాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ధన్వాడ బాలస్వామి, యాదయ్యసాగర్, సంద వెంకటేష్, గోకరయ్య తదితరులు ఉన్నారు. -
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్కు మద్దతుగా మార్చి 16న ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకు పార్టీ అగ్రనేత, ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల పదో తేదీన బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఆయన మరోసారి పాలమూరుకు రానున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మహబూబ్నగర్కు రానున్నారు. పట్టణంలో నిర్వహించే రోడ్షోతో పాటు కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో నాగర్కర్నూల్లో పర్యటించనున్నట్లు సమాచారం. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
కొత్తకోట రూరల్: రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సూచించారు. శుక్రవారం మండలంలోని అమడబాకుల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఉపకేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై గ్రామస్తులతో ఆరా తీశారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని.. బయటకు వెళ్తే వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement