-
కార్మిక వ్యతిరేక పార్టీ బీజేపీ
● టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం జైపూర్: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఓడించాలని, కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44కార్మిక చట్టాలను 4కోడ్లుగా మార్చిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఐకే1ఏ గనిపై గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి మాట్లాడారు. రాజ్యాంగం మార్పు పేరుతో దేశాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నారు. అదానీ, అంబానీ వంటి ధనవంతులకు రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ప్రధాని సామాన్య ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్నేబాజీ సైదా, సంయుక్త కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
మాతృవేదన
● గర్భంలోనే శిశువు మృతి ● రూ.80వేల బిల్లు కోసం ప్రైవేట్ ఆస్పత్రి వేధింపులు ● కుటుంబీకుల ఆందోళనఆదిలాబాద్టౌన్: మాతృత్వం ప్రతీ మహిళకు వరం లాంటిది.. అలాంటి మధురానుభూతిని పొందాల్సిన ఓ మహిళ ప్రైవేట్ ఆస్పత్రి ధనదాహంతో వేదనకు గురైన ఘటన కలచివేస్తోంది. సురక్ష ప్రసవం చేసి తల్లి, బిడ్డను కాపాడాల్సిన వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. గర్భంలోనే శిశువు మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మాతృమూర్తికి ఓదార్పునివ్వాల్సింది పోయి బిల్లులు చెల్లించే దాకా ఆస్పత్రి నుంచి కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. ప్రసవం కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఆ దంపతులకు రూ.35వేలు ఖర్చవుతుందని తెలిపిన ఆస్పత్రి వైద్యులు, తీరా రూ.80వేల బిల్లు చేసి వాటిని బలవంతంగా వసూలు చేయడం ఆస్పత్రి ధన దాహానికి నిదర్శనం. డబ్బులు చెల్లిస్తే గాని డిశ్చార్జ్ చేయమన్న వైద్యుల తీరును అంతా అసహ్యించుకుంటున్నారు. ఏం జరిగిందంటే.. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీవో సమీపంలో ద్వారకానగర్లో గల ఓ గైనిక్ ఆస్పత్రిలో మహారాష్ట్రలోని ఉమర్ఖేడ్ జిల్లా బీటర్గాంకు చెందిన లక్ష్మి డెలివరీ కోసం గతనెల 28న ఆస్పత్రిలో చేరింది. లక్ష్మికి రక్తం తక్కువగా ఉందని వైద్యురాలు సూచించారు. రక్తం ఎక్కించి డెలివరీ చేస్తామని చెప్పారు. ఇందుకు రూ.35వేల ఫీజు అవుతుందని కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేరోజు ఆమెకు సిజేరియన్ చేయగా గర్భంలోనే శిశువు మృతిచెందింది. అయితే ఈ చికిత్స కోసం మొదట ఆమె కుటుంబీకులు రూ.25వేలు ఆస్పత్రిలో చెల్లించారు. మిగతా రూ.10వేల కోసం ఆమె భర్త రామ్ స్వగ్రామానికి వెళ్లాడు. డబ్బులు లభించకపోవడంతో వారంపాటు ఆస్పత్రికి రాలేదు. గురువారం డబ్బులతో వచ్చిన రామ్ చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్తే సిబ్బంది రూ.80వేల బిల్లు అయ్యిందని చూపించగా రామ్ ఖంగుతిన్నాడు. ఇదేమిటని అడిగితే 10 బాటిళ్ల వరకు రక్తం ఎక్కించామని, భోజనం పెట్టామని, డాక్టర్ ట్రీట్మెంట్ కోసం రూ.50వేలు, రక్తం ఎక్కించినందుకు రూ.10వేలు, మందుల కోసం రూ.10వేలు, సిబ్బంది పరిశీలన, ఇతర ఖర్చులు చూపించి రూ.10వేల బిల్లు చేసి ఇచ్చారు. వేడుకున్నప్పటికీ బిల్లు తగ్గించకుండా ససేమిరా అన్నారు. బిల్లు చెల్లించిన తర్వాతే తన భార్యను ఇంటికి తీసుకెళ్లాలని, అప్పటివరకు ఇక్కడే ఉంటుందని సిబ్బంది సూచించారు. మహారాష్ట్రకు చెందిన ఆ వ్యక్తికి ఇక్కడ బంధువులెవరూ లేరు. ఈ విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొందరు అక్కడికి వెళ్లి డాక్టర్ను నిలదీశారు. ఇదేమిటని అడిగితే ఆపరేషన్, ఇతర ఖర్చులకు రూ.80వేలు అవుతుందని చెప్పారు. కొంత ఆందోళన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ను ఒప్పించి కొంత డిస్కౌంట్ ఇప్పించి మిగతా డబ్బులు చెల్లించడంతో మహిళను డిశ్చార్జ్ చేశారు. -
11న కేటీఆర్ రాక
చెన్నూర్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల 11న చెన్నూర్కు రానున్నారు. ఆ రోజు ఉదయం 11గంట లకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటా రు. ఇందుకోసం చెన్నూర్లోని ప్రభుత్వ ఉ న్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభ స్థ లాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యా రంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధి కారంలోకి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ను భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ ల్లెల దామోదర్రెడ్డి, వైస్ ఎంపీపీ వాల శ్రీని వాస్రావు, జెడ్పీటీసీ మోతె తిరుపతి, రాంలా ల్గిల్డా, నవాజ్, కృష్ణ, అనిల్, సతీశ్, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో దేశం వెనుకబడింది..
● బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి మురళీధర్రావు ● మంచిర్యాలలో కార్నర్ మీటింగ్మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మురళీధర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన గురువారం మంచిర్యాలలో ఓవర్బ్రిడ్జి, ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్, అర్చనటెక్స్ చౌరస్తాల మీదుగా శ్రీనివాస టాకీస్ వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మురళీధర్రావు మాట్లాడారు. గత పదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించి, దేశాభివృద్ధికి ముందుకు నడిపిస్తున్నారని తెలి పారు. ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరా రు. నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి, రజనీశ్జైన్, ఆనంద్ కృష్ణ, పానుగంటి మధు, తుల ఆంజనేయులు, రఘునందన్, కొయ్యాల ఏమాజి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, బోయిని హరికృష్ణ పాల్గొన్నారు. చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కేవీఏం శ్రీనివాస్ మంచిర్యాలలో మురళీధర్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. -
మాన్కాపూర్లో మద్యపాన నిషేధం
● ఉల్లంఘిస్తే గ్రామబహిష్కరణ ● గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంనార్నూర్: మద్యానికి బానిసై యువత చెడు మార్గాల వైపు వెళ్తున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. గురువారం గ్రామ పటేల్ మెస్రం రూప్దేవ్ అధ్యక్షతన సమావేశమై గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మద్యం సేవించడంతో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు మర్చి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మర్యాద కోల్పోతున్నారని తెలిపారు. గ్రామంలో ఎవరైనా మద్యం సేవించినా, విక్రయించినా గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, సీతారాం, షెడ్మారావు, బాధిరావు, కొట్నాక్ నానాజీ, భీంరావ్, ఎత్మారావు, సుంగు తదితరులున్నారు. -
ట్రిపుల్.. ట్రబుల్
● వర్సిటీని వేధిస్తున్న నిధుల కొరత ● చాలా బిల్లులు పెండింగ్లోనే ● నాలుగేళ్లుగా మొక్కుబడిగా కేటాయింపులు ● సీట్ల కుదింపు ఆలోచనలో అధికారులు ● ప్రభుత్వం దృష్టి సారిస్తేనే పరిష్కారంబడ్జెట్లోనూ అంతంతే...బాసర ట్రిపుల్ఐటీకి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ. 30 కోట్ల వరకు కేటాయిస్తుంది. ఈ నిధుల్లో 50 శాతం మాత్రమే యూనివర్సి టీకి చేరుతున్నాయి. కేటాయించిన నిధులే యూనివర్సిటీకి సరిపోవడంలేదు. అందులోంచి 50 శాతమే విడుదలచేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రిపుల్ఐటీకి సంబంధించిన డిపాజిట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగులు నిధులను గతంలో పనిచేసిన అధికారులు దూర దృష్టితో యూనివర్సిటీ పేరిట డిపాజిట్లు చేశారు. క్యాంపస్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా ఈ డిపాజిట్లను డ్రాచేస్తున్నారు. రెండు నెలల కాలంలో రూ.8 కోట్లు డ్రా చేసినట్లు సమాచారం. మళ్లీ ఇప్పుడు డిపాజిట్ల వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగైదేళ్ల క్రితం రూ.300 కోట్లు ఉన్న డిపాజిట్లు ప్రస్తుతం రూ.20 కోట్లకు వచ్చినట్లు తెలుస్తోంది. నిధులు లేక ఈ డిపాజిట్లు కూడా కరిగిపోతున్నాయి. భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటి వరకూ విడుదల కాలేదు. ఏప్రిల్ 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులనే బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ఐటీ)లో చేర్చుకుంటారు. ఏటా అడ్మిషన్లకు సంబంధించి కమిటీ వేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కమిటీ వేయనట్లు సమాచారం. పైగా గతేడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ ఏడాది 500 సీట్లు తగ్గిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ట్రిపుల్ఐటీని నిధుల కొరత వెంటాడుతున్నట్లు తెలిసింది. ఏపీలోని నూజీవీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలకు నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులంతా బాసరలోనే నోటిఫికేషన్ వచ్చిందని పొరపాటుపడుతున్నారు. ట్రిపుల్ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అందులో పూర్తిగా చదివితే ఏపీ నోటిఫికేషన్ అని తెలిసి మన బాసర నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇక ఈ విద్యాసంవత్సరంలో 1000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారా? లేక గతేడాది లాగా 1500 మందినే చేర్చుకుంటారా? అనేది తెలియడం లేదు. నిధుల కొరత...బాసర ట్రిపుల్ఐటీని నాలుగేళ్లుగా నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు సంబంధించిన రెండు నెలల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. నిధులు లేక విద్యార్థుల మౌలిక సౌకర్యాల ఏర్పాటులో ఆటంకం కలుగుతోంది. ఇందులో పనిచేసే ఉద్యోగుల వేతనాలు తప్పా మిగతా అన్ని చెల్లింపుల్లోనూ జాప్యం కనిపిస్తోంది. విద్యార్థులకు భోజన వసతి కల్పించే సంస్థలకు హౌజ్కీపింగ్, సెక్యూరిటీ, కాంట్రాక్టర్లకు ప్రతీనెల రూ.4 కోట్ల నిధులు అవసరం. విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాల కోసం రూ.2 నుంచి రూ.3 కోట్ల అవసరం ఉంటుంది. నిధుల కొ రత కారణంగా బిల్లులు చెల్లించడం లేదు. విద్యార్థు ల అవసరాల దృష్ట్యా కొన్నింటికి 15 రోజుల్లో మ రికొన్ని నెలవారీగా బిల్లులు చెల్లించాలి. కానీ నిధులు లేక మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. నిధులు లేక విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూని ఫామ్స్ సకాలంలో అందించలేకపోతున్నారు. పెండింగ్లో స్కాలర్షిప్లుబాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్ల మేర స్కాలర్షిప్ నిధులు విడుదల కావాల్సి ఉంది. క్యాంపస్ అధికారులు బీసీ, ఎస్సీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖల అధికారులను పలుమార్లు సంప్రదించినా నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఏ విద్యాసంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లు అదే ఏడాది ఇవ్వాలి. కానీ నిధులు లేకపోవడంతో ఇవ్వడంలేదు. ఈ ఏడాది మళ్లీ సమస్యలే!ఈ విద్యాసంవత్సరంలో మళ్లీ సమస్యలే ఎదురుకానున్నాయి. నిధులు లేక నోటిఫికేషన్ ఆలస్యమవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొ త్తగా చేరే విద్యార్థులకు మౌలిక వసతులు క ల్పించాలి. పైగా సీట్ల సంఖ్యపై ప్రభుత్వం ఎ లాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్ని సీట్లు భర్తీ చేయాలన్న విషయం క్యాంపస్ అధికారులు కూడా ప్రకటించడంలేదు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో ట్రిపుల్ఐటీ సమస్యలపై పోరాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విస్మరించిందని పలువురు విమర్శిస్తున్నారు.ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తున్నాం ట్రిపుల్ఐటీలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఆపడంలేదు. ప్రతీనెల వేతనాలు చెల్లిస్తున్నాం. నిధుల కొరత ఉన్నప్పటికీ ఉ ద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. నిధుల కొరత వల్ల సంస్థలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. త్వరలోనే నిధుల సమస్య తీరుతుంది. – వెంకటరమణ, వీసీ, బాసర ట్రిపుల్ఐటీ -
రోగులకు మెరుగైన సేవలందించాలి
బెల్లంపల్లి: వైద్యులు, సిబ్బంది సరిగా విధులు నిర్వర్తిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. గు రువారం ఆయన బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను కలియ తిరిగి రోగులు, సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతులు ఏ తీరుగా ఉ న్నాయి, సేవలు అందుతున్నాయా అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అడిగి తె లుసుకున్నారు. రోజువారీగా ఎంతమంది చికి త్స కోసం చేరుతున్నారు, ఏయే జబ్బులతో వ స్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారనే స మాచారాన్ని ఆరా తీశారు. డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి వ్యాధిగ్రస్తులు వినియోగించుకుంటున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి, వైద్యులు పాల్గొన్నారు. రోగులకు సౌకర్యాలు కల్పించాలి లక్సెట్టిపేట: ఆసుపత్రిలో రోగులకు అన్ని విధా ల సౌకర్యాలు కల్పించాలని వైద్య విధాన పరిష త్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్యం అందించాలని, ఆలస్యం చేయవద్దని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వడదెబ్బ రోగులకు ప్రత్యేక చికిత్స అందించాలని అన్నారు. అనంతరం ఓపీ వార్డులు, రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్సీఎస్ కోటేశ్వర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బీజేపీని గెలిపిస్తేనే దేశానికి భద్రత’
మందమర్రిరూరల్: పార్లమెంటు ఎన్నికల్లో బీ జేపీని గెలిపిస్తేనే దేశానికి భద్రత, ప్రజలకు సమానత్వం ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నా రు. గురువారం అందుగులపేటలోని ఓ ఫంక్ష న్ హాల్లో నిర్వహించిన మాదిగ–నేతకాని కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విష ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఏమాత్రం సత్యం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు సా గుతున్నాయని, వాటిని నిలువరించాల్సిన అ వసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్, ప్రధాన కా ర్యదర్శి దుర్గం అశోక్, నాయకులు అందుగుల శ్రీనివాస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, నేతకాని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
● తుది అంకానికి ఎంపీ ఎన్నికలు ● రేపటితో ముగియనున్న ప్రచారం ● విస్తృతంగా పర్యటిస్తున్న అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్లమెంటు ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 48గంటల ముందే బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. ఈ నెల 13న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 6గంటల వరకే అనుమతి ఉంది. ఈ చివరి రెండు రోజుల్లో అభ్యర్థులు వీలైనంత ఎక్కువ మందిని కలిసి ఓట్లు అభ్యర్థించేలా ప్రణాళిక రచించుకున్నారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉండడంతో పరిధి ఎక్కువగా ఉంది. ప్రతీ చోటుకు వెళ్లి సమయం వెచ్చించడం అభ్యర్థులకు కష్టంగా మారింది. అయినప్పటికీ వీలైనంత ఎక్కువ సేపు ప్రజల్లో గడుపుతున్నారు. గత వారం రోజులుగా ఉదయం 7గంటల నుంచే గ్రామాల్లోకి వెళ్తున్నారు. రాత్రి ప్రచార సమయం అనుమతి ఉన్న 10గంటల దాకా జనం మధ్యే గడిపేస్తున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు, నాయకులతో మంతనాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులతో పోల్చుకుంటూ అంతర్గతంగా తమ పరిస్థితి అంచనా వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ జోరు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియానూ అభ్యర్థులు ఓట్లు రాబట్టేందుకు ప్రచార సాధనంగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లో ఎప్పటికప్పుడు లైవ్ ప్రసారాలతోపాటు ఫొటోలు, వీడియోలు, ప్రసంగాలను అప్లోడ్ చేస్తున్నారు. ఆడియో, వీడియో సందేశాలు, టెలీకాలర్లతో ఫోన్లు, మేసేజ్లు ఓటర్లకు పంపిస్తున్నారు. ప్రచారం కోసం ప్రతీ అభ్యర్థి ప్రత్యేక వాట్సాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు తమ గ్రూప్ల్లో పోస్టు చేస్తున్నారు. అంతేకాక ప్రచార షెడ్యూల్, కార్యక్రమాలు అన్ని వాట్సాప్ వేదికగా పంచుకుంటున్నారు. డిజిటల్ ప్రకటనలు, వీడియోలతో సోషల్ మీడియాలో జోరు పెంచుతున్నారు. అనుచర గణంతో వివిధ రకాలుగా విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్మీడియా కోసం ప్రచారకర్తలను నియమించుకున్నారు. సంఘాలు, నాయకులతో ఆయా ప్రాంతాల్లో ప్రభావిత నాయకులతో టచ్లో ఉంటున్నారు. కుల, ప్రజా, యువజన, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, కార్మిక, వ్యాపార సంఘాలను ప్రత్యేకంగా కలుస్తున్నారు. తమ పార్టీ అనుబంధ సంఘాలు, స్వతంత్రంగా ఉండే సంఘ నాయకులను తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సొంత, ప్రత్యర్థి పార్టీ నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, కీలక వ్యక్తులను తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గెలిస్తే స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎక్కువ ఓట్లున్న చోట దృష్టిప్రచారంలో ఎక్కువగా ఓట్లు ఉన్న ప్రాంతాల్లో అధిక సమయం కేటాయిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు నస్పూర్, మందమర్రి వంటి పట్టణాలపై అభ్యర్థులు దృష్టి సారించారు. మున్సిపాల్టీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కుదరని చోట ప్రచార రథాలపైనే ప్రసంగిస్తున్నారు. బైక్ర్యాలీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు జన సమీకరణ చేస్తూ కాలనీలు, వాడల్లో పర్యటిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలు పని స్థలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సింగరేణి కార్మికులను కలిసేందుకు బొగ్గుబాయిల వద్దకు వెళ్తున్నారు. వీరితోపాటు మార్కెట్లు, వారసంతలు, శుభకార్యాలకు హాజరవుతున్నారు. తమతోపాటు కుటుంబీకులు, అనుచరులు, బంధుగణాన్ని ప్రచారంలో భాగస్వామ్యం చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల భాగస్వామ్యం
జిల్లాలో 84,780మంది నిరక్షరాస్యులు ఉండగా.. భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నె ల, కోటపల్లి, దండేపల్లి మండలాల్లో అత్యధికంగా 25,205మంది ఉన్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో దాదాపు 32వేలమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరిని అక్షరాస్యులుగా మార్చేందుకు జిల్లాలోని 108 ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున 324 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఆసక్తి గల వారు పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, లింగం తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువులు సాగుతాయి. అవసరమైతే స్వ చ్ఛంద సేవకులతో కూడా చదువు చెప్పించేలా చూస్తున్నారు. అందరి సహకారంతో నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. -
‘కాకా’ కుటుంబం చేసిందేమీ లేదు
● బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్తాండూర్/కాసిపేట: గత 30ఏళ్లుగా కాకా కుటుంబం నుంచి అధికారంలో ఉంటూ పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ విమర్శించారు. గురువారం ఆయన జిల్లాలోని తాండూర్, కాసిపేట మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ‘గడ్డం’ కుటుంబాన్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా పేరు వెంకటస్వామి జిల్లాగా మారుస్తారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ పరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని బలపర్చేందుకు బీజేపీ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాసిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ తాండూర్, కాసిపేట మండలాల అధ్యక్షులు దూడపాక భరత్కుమార్, సంపత్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధీర్గౌడ్, నాయకులు కోడి రమేష్, పాగిడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాల కాంగ్రెస్ను ఓడించాలి
● ఎన్నికల హామీలు అమలు చేయలేదు ● బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్బెల్లంపల్లి/కాసిపేట/భీమిని: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓటర్లను కోరారు. గురువారం బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట 1, కాసిపేట 2గనులపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ నాయకులతో కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు. కన్నెపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో రకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రూ.7,500 కోట్లు తీసుకు వచ్చి రైతుల ఖాతాల్లో జమ చేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మోసం చేసిందని అన్నారు. యువకులకు నిరుద్యోగ భృతి, పంట రుణాలు మాఫీ, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీలిచ్చి అమలు చేయలేదని తెలిపారు. కార్మికుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, ఐటీ రద్దు, పెన్షన్ విధానంలో మార్పులు, అభివృద్ధి కోసం తనకు ఆరాటం ఉంటుంది తప్ప హైదరాబాద్లో ఉండే వాళ్లకు ఉండదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ రాజనాల కమల, శ్రావణ్, శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, జెట్పీటీసీలు చెంద్రయ్య, సత్యనారాయణ, అక్కెపల్లి బుగ్గరాజు, నిరంజన్గుప్తా, ప్రమోద్, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్కు ముందు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్ ● అధికారులతో సమీక్ష సమావేశంమంచిర్యాలటౌన్: ఈ నెల 13న జరిగే పోలింగ్కు ముందు 72 గంటల సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూరులోని సమీకృత కలెక్టరేట్లో డీసీపీ అశోక్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్తో కలిసి జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని అన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటల నుంచి జిల్లాలోని వైన్షాపులను మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ, మద్యనిషేధ శాఖ అధికారి జి.నందగోపాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, కమర్షియల్ ట్యాక్స్ అధికారి శివప్రసాద్, కేంద్రీయ జీఎస్టీ అధికారి శుభంకర్, ఆదాయపన్ను శాఖ అధికారి సూర్య భగవాన్, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోశ్కుమార్, ప్రధాన తపాలా కార్యాలయ పర్యవేక్షకులు సంజయ్కుమార్, నోడల్ అధికారి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి మంచిర్యాలటౌన్: పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం డీసీపీ అశోక్, ఆర్డీవో వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల సమీపంలో గుంపులుగా ఉండవద్దని, లౌడ్ స్పీకర్లు, ఇతరత్రా ప్రచార అంశాలను నిషేధించామని పేర్కొన్నారు. ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం మంచిర్యాలటౌన్: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్ యూనిట్లో 42 మంది అభ్యర్థులు, 1 నోటా గుర్తులు ఉంటాయని, ఒక కంపాట్మెంటులో 3 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, 1 వీవీ ప్యాట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. 13న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. డీసీపీ అశోక్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 3 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆర్డీవో రాములు, జిల్లా పౌరసంబంధాల అధికారి జే.శారద పాల్గొన్నారు. -
13న సింగరేణికి సెలవు
శ్రీరాంపూర్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న సింగరేణి యాజమాన్యం వేతనం (పీహెచ్డీ)తో కూడిన సెలవును మంజూరు చేసింది. ఈమేరకు గురువారం కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల్లో కంపెనీ ప్రతి ఉద్యోగి, అధికారి తన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొంది. ఇద్దరు దొంగల అరెస్టు లక్సెట్టిపేట: మండలంలోని పాత కొమ్ముగూడె ం గ్రామానికి చెందిన ల చ్చవ్వ వద్ద రూ.25 వేలు అపహరించిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన ట్లు సీఐ నరేందర్, ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామానికి చెందిన శివరాత్రి సదయ్య, పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు చెందిన గాదాసు రాజయ్య గురువారం ఉదయం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.23 వేలు రికవరీ చేసినట్లు తెలిపారు. -
జీజీహెచ్లో షార్ట్ సర్క్యూట్
● పాడైన కంప్యూటర్లు, వైద్య పరికరాలు ● రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో వైద్యపరికరాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. ఇటీవల వీచిన ఈదురుగాలులకు ఆస్పత్రికి విద్యుత్ సరఫరా చేసే స్తంభం నేలవాలింది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్పత్రిలోని ఆరు కంప్యూటర్లు, మూడు ఈసీజీ మిషన్లు, ఐదు మల్టీప్యారా మీటర్లు, రెండు ఎబాస్ మిషన్ అడాప్టర్లు, విద్యుత్ కంట్రోల్ ప్యానల్, ఫ్యాన్లు, లైట్లు, సీసీ కెమెరాలు, రెండు సిరంజి పంపులు, ఒక వెంటిలేటర్ ఎయిర్ కంప్రెషర్, ఇంటర్నెట్ రూటర్లు పాడైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రరెడ్డి తెలిపారు. రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. -
మున్సిపల్ దస్త్రాల కాల్చివేత!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో ఉన్న పాత దస్త్రాలను గుట్టు చప్పుడు కాకుండా డంపింగ్ యార్డుకు తరలించి కాల్చివేసినట్లు సమాచారం. రెవెన్యూ విభాగానికి ఇంటి నంబర్లు, మ్యూటేషన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వస్తుంటాయి. మున్సిపల్ దుకాణ సముదాయాల నుండి వచ్చే ఆదాయ వివరాలు, పన్ను వసూళ్లు, ఇంటి కొలతల ప్రకారం విధించిన పన్ను వివరాలకు సంబంధించిన దస్త్రాలు ఈ విభాగంలో ఉంటాయి. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని దస్త్రాలను డంపింగ్ యార్డుకు తరలించి కాలుస్తుండగా విషయం బయటకు పొక్కింది. దీంతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆదేశంతో మిగిలిన దస్త్రాలను తీసుకువచ్చి కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ కాంప్లెక్సులో భద్రపరిచినట్లు సమాచారం. ఈ విషయమై కమిషనర్ను వివరణ కోరగా రెవెన్యూ విభాగంలో అదనంగా ఉండే కొన్ని పేపర్లను డంపింగ్ యార్డుకు తరలించినట్లు తెలియగానే వాటిని కార్యాలయానికి తెప్పించామని, కాల్చడం వంటివి చేయలేదన్నారు. -
‘గనుల వేలం ఆగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి’
కాసిపేట: సింగరేణిలో గనుల వేలం (ప్రైవేటీకరణ) ఆగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ , సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ బడా కాంట్రాక్టర్లకు అప్పగించి వారికి ఊడిగం చేస్తుందన్నారు. సింగరేణిని మొదటి నుంచి కాపాడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీయేనని, కాకా వెంకటస్వామి నష్టాల్లో ఉన్న సంస్థను వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, నాయకులు శ్రీనివాస్, చిప్ప నర్సయ్య, బియ్యాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యతకు మరో అడుగు
● ఎన్ఐఎల్పీ పథకానికి త్వరలో శ్రీకారం ● ఇక నిరక్షరాస్యుల్లో అక్షరకాంతులు ● ఉపాధ్యాయులతో బోధనకు ప్రణాళికమంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో ప్రతీ ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుడుతోంది. నవభారత సాక్షరత(ఎన్ఐఎల్పీ–న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం)కు అంకురార్పణ జరగనుంది. చదువుకోలేని వారితోపాటు వయోజనులకు చదవడం, రాయడం రావాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. సంపూర్ణ అక్షరాస్యత కోసం చేపట్టిన సాక్షర భారత్ కార్యక్రమాన్ని ఆరేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి వయోజనులకు అక్షరాలు నేర్పించే కార్యక్రమం అటకెక్కింది. నవ భారత సాక్షరత ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే ఐదేళ్లలో 2022నుంచి 2027వరకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15ఏళ్లు పైబడి నిరక్షరాస్యులకు ఐదు దశల్లో శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతోపాటు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పొందేలా చూడడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ పథకం విజయవంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40శాతం నిధులు వెచ్చించనున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.జిల్లాను ముందుంచుతాం.. కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత కార్యక్రమం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వయోజనులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విద్యావంతుల సహకారంతో చదువులు చెప్పించి అక్షరాస్యతలో జిల్లాను ముందుంచుతాం. – పురుషోత్తంనాయక్, జిల్లా వయోజన విద్యాధికారి -
‘గోడం నగేష్ను గెలిపించుకోవాలి’
జన్నారం: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ను గెలిపించుకునేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్రావు, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రినాయక్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బెడద గోపాల్, యువమోర్చా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, పట్టణ అధ్యక్షుడు సూర్యం, నాయకులు లక్ష్మీరాజం, సత్తన్న, చంద్రశేఖర్, రమేశ్గౌడ్, మహేశ్, జలపతి, తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
అదృశ్యమైన వృద్ధురాలి మృతదేహం లభ్యంజైపూర్: ఈ నెల 2న అదృశ్యమైన వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం మండలంలోని ఇందారం రైల్వేట్రాక్ సమీపంలోని చెట్లపొదల్లో పోలీసులు గుర్తించారు. మంచిర్యాల రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పొగిల్ల యాదగిరి తల్లి కొండమ్మ(70) మతిస్థిమితం కోల్పోయి ఈ నెల 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ నెల 6న మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వృద్ధురాలు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై ఆరా తీయగా కొండమ్మగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. రామాలయంలో చోరీజన్నారం: మండలంలోని రేండ్లగూడ రామాలయంలో బుధవారం రాత్రి చోరి జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోనికి ప్రవేశించి ప్రధాన ద్వారం పగులగొట్టే ప్రయత్నం చేశారు. తలుపులు తెరుచుకోకపోవడంతో హుండీని అపహరించుకుపోయారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాజవర్దన్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు పెన్గంగలో పడి మహిళ మృతికౌటాల: మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన చునార్కార్ మీరాబాయి (58) ప్రమాదవశాత్తు పెన్గంగలో పడి మృతి చెందిందని ఎస్సై ఎన్.మధుకర్ గురువారం తెలిపారు. మీరాబాయి బుధవారం గ్రామ శివారులోని తమ చేనులో మిర్చి తెంపేందుకు వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా పెన్గంగలో మృతదేహాన్ని గుర్తించారు. నదిలో నీటిని తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు మోరేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి’
మంచిర్యాలక్రైం: రోగుల ప్రాణాలలో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో సూపరింటెండెంట్ విశ్వేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నందిని, మెడిలైఫ్ ఆస్పత్రుల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ నెల 6న బెల్లంపల్లికి చెందిన గర్భిణి రవళిక మృతి చెందిందన్నారు. దీనిపై విచారణ జరిపించి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన రక్షణ సమితి నాయకులు వేముల వీరేందర్, తోట రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి గేదె మృతి
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం కోటేశ్వర్రావుపల్లె గ్రామ శివారులో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్తీగ తెగిపడి ఓ గేదె మృతి చెందింది. కనవేని కుమార్కు చెందిన పాడిగేదెను మేతకు తీసుకెళ్లి వస్తుండగా పొలంలో మెయిన్లైన్ తెగిపడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.90 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు కోరుతున్నాడు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళనబెల్లంపల్లిరూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రవెల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు గురువారం బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ చాలా రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్నా డబ్బులు పడడంలేదని, పనికి వెళ్లినా సక్రమంగా హాజరు వేయడంలేదని ఆరోపించారు. ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీడీవో మహేందర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
వ్యాపారి అదృశ్యం
కౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నాగమల్ల సురేష్ ఈ నెల 6న అదృశ్యమైనట్లు టౌన్ ఎస్సై అంజయ్య గురువారం తెలిపారు. చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహించే సురేష్ ఇతరుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిళ్లు వస్తుండడంతో తట్టుకోలేక ఇంటినుంచి వెళ్లిపోయాడన్నారు. వ్యాపారి భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేత చెన్నూర్: పట్టణంలోని జాతీయ రహదారిపై గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. కోటపల్లి మండలం కొల్లూరు ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంది. వాహనాల తనిఖీలో భాగంగా లారీని తనిఖీ చేయగా డ్రైవర్ మనోరంజన్ హజ్రా వద్ద ఎలాంటి వేబిల్లు లభించలేదు. దీంతో లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్ మనోరంజన్ హజ్రాతో పాటు లారీ యాజమాని జంగ రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. కాగా నెలరోజుల క్రితం ఇదే లారీ పట్టుబడినట్లు సీఐ తెలిపారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతితానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ డి.విఠల్ (60) బుధవారం రాత్రి వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఉపాధిహమీ పనులకు వెళ్లిన విఠల్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దాడి కేసులో ఇద్దరికి జైలునిర్మల్టౌన్: ఒకరిపై దాడి చేసిన కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు కోర్టు సమన్వయల అధికారి సక్రియ నాయక్ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన రొడ్డ ఎర్రన్న ఇంటిముందు 2016 నవంబర్ 12న అదే గ్రామానికి చెందిన గడ్డం రాజు, అతని తండ్రి గంగన్న చెత్త పారేయడంతో వారిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై దాడిచేసి గాయపర్చారు. బాధితుడు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై అరిఫొద్దీన్ కేసు నమోదు చేశారు. ఏపీపీవో రామకృష్ణ తొమ్మిది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో నిర్మల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అజయ్కుమార్ నిందితులు గడ్డం రాజు, గంగన్నకు ఐదునెలల సాధారణ జైలు, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. ఇద్దరు వ్యక్తులపై కేసుఆదిలాబాద్టౌన్: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై గురువారం టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన గణేశ్ రఫీక్ అనే వ్యక్తితో మద్యం తెప్పిస్తూ కాలనీలో అమ్మకాలు జరుపుతున్నాడు. బస్టాండ్ వైపు నుంచి 10 లీటర్ల మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భూగర్భ గనిలో పనికి భయపడి ఆత్మహత్య●
మంచిర్యాలక్రైం: తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేయలేక ఓ సింగరేణి కార్మికుడు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ ఓదెలు సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయి రెండో కు మారుడు సాయికుమార్(27)ను పనిలో పె ట్టించాడు. గత నెల 20న ఆర్జీ–1 గోదావరిఖని మైన్లో బదివీ వర్కర్గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి సాయికుమార్ తరచూ తండ్రితో నాన్న నాకు మైన్లో దిగాలంటే భయంగా ఉంది.. నేను ఉద్యోగం చేయలేనంటూ మొరపెట్టుకునేవాడు. కొన్ని రోజు లు కష్టపడితే ఓపెన్కాస్ట్లో పెట్టిస్తానని తండ్రి ధైర్యం చెప్తూ వచ్చాడు. గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు ప ట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా
● కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ జన్నారం: ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. గురువారం గౌడ సంఘం మండల అధ్యక్షుడు మూల భాస్కర్గౌడ్తో పాటు కవ్వాల్ గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. వారికి సుగుణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కొత్తురుపల్లి, దేవునిగూడ, తిమ్మాపూర్, రాంపూర్ , తపాలపూర్, చింతగూడ గ్రామాల్లో మాజీ మంత్రి వేణుగోపాలాచారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, రాజశేఖర్, సుభాష్రెడ్డి, లక్ష్మీనారాయణ, ఇందయ్య, కరుణాకర్, తిరుపతిగౌడ్, చంద్రయ్య, రాకేశ్గౌడ్, శాఖీర్, ముజ్జు, తదితరులు పాల్గొన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement