-
ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
మంగపేట: ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఇసుక క్వారీల్లో రైజింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచార హక్కు చట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వాగబోయిన సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గోదావరి ఇసుక క్వారీలకు అనుమతి పొందిన ఆదివాసీ గిరిజన సొసైటీలను చేజిక్కించుకుని బినామీలుగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించి కూలీలు, ట్రాక్టర్లతో కాకుండా యంత్రాలతో ఇసుకను తరలించిన రైజింగ్ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
భూపాలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. స్వీప్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానం నుంచి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో శుక్రవారం నిర్వహించిన 5కే రన్ను ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతం అధికంగా నమోదయ్యేలా సహకరించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఏర్పాట్లు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి పాఠశాలలో ఏర్పాట్లును పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లాలో 2,072 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మూడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ బూతులో రద్దీ నియంత్రణకు రెండు బాక్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సమయం కేటాయించినట్లు తెలిపారు. 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న హోం ఓటింగ్లో నియోజకవర్గంలో 78మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేక అధికారుల నియామకం ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు, నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పోలింగ్ ఏర్పాట్ల పరిశీలనకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీరు, విద్యుత్, ర్యాంపు, వీల్ చైర్, క్యూలో ఫ్యాన్లు వంటి సౌకర్యాలను ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ నాటికి ఓటరు స్లిప్ల పంపిణీ పూర్తి కావాలన్నారు. 12, 13 తేదీల్లో పోలింగ్ సిబ్బంది బస, భోజన ఏర్పాట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎంల కేటాయింపు.. సప్లిమెంటర్ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియకు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ స్థానానికి 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని 317పోలింగ్ కేంద్రాలకు 127శాతంతో ఈవీఎంలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అభినందన ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులను శుక్రవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్లో అభినందించారు. చిట్యాల కస్తూర్భా గాంధీ విద్యాలయానికి చెందిన కొత్తూరు అంజన, పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఊరుగొండ సాహిత్య, గాంధీనగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన గడ్డం అక్షయ, ముత్యాల అభినయలకు కలెక్టర్ శాలువాలు కప్పి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీఓ శామ్యూల్ ఆర్డీఓ, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంగీలాల్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్ధార్ శ్రీనివాస్, డీఈఓ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.మండలాల ప్రత్యేక అధికారులు వీరే.. నారాయణరావు, డీపీఓ, భూపాలపల్లి మండలం నరేష్, డీఆర్డీఓ, గణపురం శ్యామూల్, సీపీఓ, రేగొండ విజయభాస్కర్, డీఏఓ, కొత్తపల్లిగోరి వెంకటేశ్వర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, చిట్యాల శైలజ, బీసీ సంక్షేమ అధికారి, టేకుమట్ల సునీత, ఎస్సీ అభివృద్ధి అధికారి మొగుళ్లపల్లి సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శాయంపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా వెల్లడి -
సూర్యప్రతాపం
కాళేశ్వరం: సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా వేసవి ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా 40డిగ్రీల సెల్సియస్ను దాటి కొడుతున్న ఎండలతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల తీరప్రాంతంలో ఇసుక మేటలు భారీగా ఉండడంతో కాళేశ్వరంతోపాటు పరిసర ప్రాంతాలన్ని హీటెక్కుతుండడంతో కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాక తగ్గిపోయింది. భక్తుల రాకపై ప్రభావం.. నిత్యం కాళేశ్వరాలయానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఎండల తీవ్రతతో వందల సంఖ్యలోనే వస్తున్నారు. ఏప్రిల్ నుంచి భక్తుల రాక తగ్గుతూ వస్తోంది. ఎండ తీవ్రతకు ఉదయం 10గంటల లోపు వరకు, సాయంత్రం 5గంటల తర్వాత దర్శనానికి వస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ఆలయ ఆదాయం కూడా తగ్గుతుందని తెలిపారు. పెరిగిన విద్యుత్ వినియోగం భానుడు తన ప్రతాన్ని చూపడంతో జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలర్లు, ఏసీలతోపాటు, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని మార్చి– ఏప్రిల్లో 663.54లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఏప్రిల్– మే(ఇప్పటివరకు) నెలలో 805.2లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రిసైతం తప్పని ఉక్కపోత పెరిగిన విద్యుత్ వినియోగం మండుతున్న సూరీడు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవా రం జిల్లాలో గరిష్టంగా 46.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 7మండలాలు రెడ్ అలర్ట్లోకి వెళ్లాయి. గణపురం మండలం చెల్పూర్, మొగుళ్లపల్లిలో 46.3, రేగొండ, తాడిచర్లలో 45.6, చిట్యాలలో 45.3, కాటారంలో 45.2, మల్హర్ మండలం మల్లారంలో 45.1, మహా ముత్తారంలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడితో జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. -
బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ రంగ సంస్థలను ని ర్వీర్యం చేస్తున్న మోదీ పాలనకు పార్లమెంట్ ఎన్నికల్లో చరమగీతం పాడి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కొరిమిరాజ్ కుమార్ అధ్యక్షతన వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపును కోరుతూ నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమవేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ద్వంసంచేస్తూ, అదానీ, అంబానికి కొమ్ముకాస్తున్న మోదీ మరోసారి అధికా రంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మారుస్తాడని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న పేదలు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. కడియం కావ్యను గెలిపించాలని కోరారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. మోదీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని దక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ వారికి ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, నాయకులు రమేష్, సుగుణ, రమేష్, విజయసారథి, నమ్మరెడ్డి, ప్రవీణ్, వెంకటేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
విద్యార్థులు లక్ష్యం ఎంచుకోవాలి
మొగుళ్లపల్లి: విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి లక్ష్యం నిర్ణయించుకుని ముందుకు సాగాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయపాల్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్ సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జాబ్మేళాకు విశేష స్పందన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్, ప్రిన్సిపాల్ ఎలుగూరి హరికృష్ణ అధ్యక్షతన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో జెన్ ప్యాక్ట్ కంపెనీ, హెచ్ఆర్ శ్యామ్ సన్ మెగా జాబ్ మేళాలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్మేళాకు 153మంది అభ్యర్థులు హాజరు కాగా జెన్ ఫ్యాక్ట్ కంపెనీ హెచ్ఆర్ 46మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా వచ్చిన ఉద్యోగాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు మొగిలి, రాజశేఖర్, నరేష్, ప్రవీణ్, ఆనంద్, ఉదయలక్ష్మి, మమత, రాజు, రంజిత్ పాల్గొన్నారు. పనుల పరిశీలన రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకోసం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులను చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ చిట్యాల: మండలకేంద్రానికి చెందిన చింతల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మృతుడి కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు చింతల రమేష్, పువ్వాటి హరికృష్ణ, గురుకుంట్ల కిరణ్, కొడెల రాయమల్లు, ఉప్పుల కిరణ్, కొత్త శ్రీనివాస్, తణుకు మధు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement