-
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
దర్శకుడు అమీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉయిర్ తమిళుక్కు. చాందిని శ్రీధర్ హీరోయిన్గా నటించారు. అనంద్రాజ్, ఇమాన్ అన్నాచ్చి, రాజ్కపూర్, మారిముత్తు, సుబ్రమణిశివ, మహానది శంకర్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, శరవణ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.ఎవరూ ముందుకు రావట్లేఈ మూవీ విడుదల హక్కులను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం చైన్నెలో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత ఆదంబావ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దర్శకుడు అమీర్ హీరోగా నటించడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.ఆయన అలా.. ఈయన ఇలాతనను దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనేనన్నారు. అమీర్ తనకు 40 ఏళ్ల మిత్రుడని చెప్పారు. తామిద్దం మదురైకు చెందిన వారిమేనని చెప్పారు. అమీర్ మదురైలో భాషాలా ఉండేవారని, సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాణిక్యంగా మారారని, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంగా మార్చుతున్నారన్నారు. అమీర్ తమిళంపై ప్రేమతో చాలా కోల్పోయారని, ఆయన సమకాలీకుడు సీమాన్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాణిస్తున్నారన్నారు.ఆ అవసరం నాకు లేదుదర్శకుడు, ఈ చిత్ర కథానాయకుడు అమీర్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఇరైవన్ మిగ పెరియవన్ చిత్ర నిర్మాత నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటుంటే తనను అందుకు బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. అయినా ఈ కేసు విచారణలో ఉందని, తాను ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. -
బాలుడిపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
పళ్లిపట్టు: బైకులో వేచివున్న బాలుడిపై దాడి చేసి గాయపరిచి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పళ్లిపట్టు సమీపంలోని కుమార రాజుపేట గ్రామానికి చెందిన కుమార్ కొడుకు విజయ్(17) శుక్రవారం సాయంత్రం బైకులో అతని మిత్రుడు మురళితో పళ్లిపట్టుకు వెళ్లాడు. ప్రధాన రోడ్డులో బైకుకు ముందు బస్సు ఆగి ఉండడంతో బైకులో వేచివున్న విజయ్ని బైకు తీయమని అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి అసభ్యపదజాలంతో మాట్లాడి రాయితో దాడి చేసి గాయపరిచినట్లు, హత్యా చేస్తానని బెదిరించారు. గాయపడిన బాలుడుని అతని మిత్రుడు ఆస్పత్రిలో చేర్పించాడు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబందించి కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపాల్ కేసు నమోదు చేసి పళ్లిపట్టు ఈచ్చంపాడికి చెందిన గోపి, బుజ్జిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం పళ్లిపట్టు కోర్టులో హజరు పరిచి, తిరుత్తణి సబ్ జైలుకు తరలించారు. -
కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్టు
కొరుక్కుపేట: రూ. 34 లక్షలు రుణం చెల్లించకపోవడంతో యువకుడిని కారులో కిడ్నాప్ చేసిన మాతేష్సహ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా పార్కూర్ నక్కల్ పట్టి గ్రామానికి చెందిన బాలాజీ(32) కుటుంబంలో విభేదాల కారణంగా భార్యకు విడాకులు ఇచ్చి, ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ స్థితిలో కృష్ణగిరి జిల్లా కరాడికొళ్లపట్టి ప్రాంతానికి చెందిన తన మామ బంధువు మాతేష్ వద్ద బాలాజీ రూ. 34 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత వ్యవధిలోగా రుణం చెల్లించలేదు. ఆ తర్వాత డబ్బుకు బదులుగా బాలాజీ పేరిట ఉన్న 2 ఎకరాల 22 సెంట్ల భూమిని తన తండ్రి పేరు మీద రాసివ్వాలని మాతేష్ పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ స్థితిలో బాలాజీ ఈ నెల ఒకటో తేదీన అద్దె కారులో చైన్నె వెళ్లాడు. ఆ తర్వాత మాతేష్ కొందరు స్నేహితులతో కలిసి కారులో అతడిని అనుసరించాడు. బాలాజీ, డ్రైవర్ రిదీష్ను కారుతో అపహరించి ధర్మపురి జిల్లా కారిమంగళంలోని కుంబరహళ్లి చెక్పోస్టు సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బంధించారు. మరుసటి రోజు ఉదయం బాలాజీని కృష్ణగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. భూమిని మాతేష్ తన తండ్రి మురుగేషన్ పేరు మీద రిజిస్టర్ చేయాలని కోరారు. అందుకు అతడు అంగీకరించకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే బాలాజీ కరీముంగ్కాలం పోలీసు స్టేషన్కు వెళ్లి సంఘటనపై ఫిర్యాదు చేశారు. లాడ్జి వద్ద ఉన్న మాతేష్తోపాటు శాంతకుమార్ (44), సెల్వ కమల్ (46), రాజ్సుమల్ (36), కార్తీక్ (31)ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, లగ్జరీ కారును, కిడ్నాప్కు ఉపయోగించిన కత్తి సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న గోవిందన్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. -
నడిరోడ్డులో వివాహిత హత్య
తిరువొత్తియూరు: తూత్తుకుడిలో బైక్లో వెళుతున్న వివాహితను అడ్డుకుని కత్తితో దాడి చేసి హత్య చేసి న భర్తతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా ముత్తులాపురం గ్రామానికి చెందిన బాల మురుగన్ (35)కి చందన మారియమ్మాళ్ (32)తో 2017లో వివా హం జరిగింది. బాలమురుగను సింగపూర్లో పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో అక్కడ సంపాదించిన నగదును మారియమ్మాళ్కు పంపుతూ వచ్చాడు. ఆ నగదుతో తూత్తుకుడిలో చందన మారియమ్మాళ్ స్థలం తీసి ఇల్లు కట్టుకుంది. ఆ ఇంటిని తన పేరుతో రాయించుకుంది. ఒక సంవత్సరం కిందట బాలమురుగన్ తిరిగి, ఇండియాకు వచ్చాడు. బాలమురుగన్ ఖర్చులకు నగదు అడిగిన సమయంలో చందన మారియమ్మాళ్ ఇవ్వడానికి తిరస్కరించినట్లు తెలిసింది.చందన మారియమ్మాల్ తూతుకూడి కార్పొరేషన్ కమిషనర్ ఇంట్లో పనిచేస్తుండంతో దీనికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చందనమారియమ్మాళ్ తన మేనమామ కాళిముత్తు నుంచి 40 సవర్లు నగలు తీసుకుని, వాటిని తిరిగి ఇవ్వలేదని తెలిసింది. ఈ కారణంగా బాలమురుగన్, కాళిముత్తు అనే ఇద్దరు చందన మారియమ్మాళ్పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చందన మారియమ్మాళ్ బయటకు వెళ్లి మోపెడ్లో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో గణేష్నగర్ మార్గంలో వస్తుండగా బాలమురుగన్, కాళి ముత్తు నడిరోడ్డులో ఆమెను అడ్డుకుని చందన మారియమ్మాళ్పై కత్తులతో దాడి చేశారు. దీంతో చందన మారియమ్మాళ్ అక్కడికక్కడే మృతి చెందింది. దీని తర్వాత ఇద్దరూ తూత్తుకుడి తెన్భాగం పోలీసుస్టేషన్లో సరెండర్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. -
13 నుంచి కాంగేశంకు నౌక సేవ షురూ
సాక్షి, చైన్నె : తమిళనాడులోని నాగపట్నం– శ్రీలంకలోని కాంగేశం హార్బర్ మధ్య నౌక సేవలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆదివారం అఽధికారులు ప్రకటించారు. ఈనౌక మే 13వ తేదీ నుంచి రెండు దేశాల మధ్య ప్రయాణించనున్నదని పేర్కొంటూ చార్జీల వివరాలను వెల్లడించారు. నాలుగు దశాబ్దాల అనంతరం తమిళనాడు – శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌక నడిపేందుకు కేంద్రప్రభుత్వం గత ఏడాది చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సిరియపాణి అని నామకరణం చేసిన నౌకలో 150 మంది ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అక్టోబర్లో ఈ నౌకాయానం సేవలకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు 50 మంది, మరుసటి రోజు 15 మంది మాత్రమే ఈ నౌకలో ప్రయాణించారు. పాస్ పోర్టు, వీసా, ఇతర అనుమతులను పొందడంలో నెలకొన్న జాప్యంతోపాటు డీజిల్ ఖర్చులకు కూడా సరి పడేందుకు తగినట్టుగా ప్రయాణికుల సంఖ్య లేక పోవడంతో సేవలను రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని రకాల సమస్యలను అధిగమించారు. వీసా లేకుండా నౌక ప్రయాణానికి సంబంధించిన అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఈ నౌక సేవలను మళ్లీ పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సిరియాపాణి అన్న నౌకను పక్కన పెట్టి శివగంగై పేరిట కొత్త నౌకను సిద్ధం చేశారు. ఈ నౌక సేవలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. 133 మంది ప్రయాణించేందుకు వీలుగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ప్రీమియం తరగతులకు రూ.7500, సాధారణ తరగతికి ఒకరికి రూ. 5 వేలు చార్జీ నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, ప్రయాణికులకు ప్రత్యేకంగా ఆహారం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement