-
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్తో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్లో సింగిల్ సాంగ్తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
అదంతా నాటకం.. అతన్ని విజయ్ గుడ్డిగా నమ్ముతున్నాడు: దళపతి
తమిళసినిమా: అభిమానులు దళపతిగా నెత్తిన మోస్తున్న నటుడు విజయ్. ఈయన్ని ప్రారంభ కాలంలో నటుడిగా నిలబెట్టింది ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. నాళైయతీర్పు చిత్రంతో విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేసింది ఆయనే. ఆ తరువాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. అదే విధంగా విజయ్ను రాయకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం చుట్టిందీ ఆయన తండ్రే. మొన్న మొన్నటి వరకూ విజయ్ గురించి, ఆయన చిత్రాల కాల్షీట్స్ గురించి అంతా చూసుకుంది దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్నే. విజయ్ పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ, విజయ్ తన తండ్రిని దూరంగా పెట్టారు. ఆయనతో మాట్లాడటమే పాపంగా భావిస్తున్నారు. కాగా కొంత కాలం క్రితం పుదుచ్చేరి శాసన సభ్యుడు బుషీఆనంద్ నటుడు విజయ్ సరసన చేరి ఇప్పుడు అంతా ఆయనేగా మారారు. విజయ్ రాజకీయ రంగాన్ని ఆయనే రచిస్తున్నారు. ఈ వ్యవహారంపై మౌనం వహించిన విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తాజాగా బరస్ట్ అయ్యారు. తన కొడుకు విజయ్తో అంటకాగుతున్న బుషీ ఆనంద్ గురించి తన ఎక్స్ మీడియాలో స్పందిస్తూ అంతా నాటకం అని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి వారో చెబుతూ తాను బుషీ ఆనంద్పై కావాలని ఆరోపణలు చేయడం లేదని, నిజం ఏమిటన్నది మీరందరికీ తెలుసన్నారు. ఆయన ఆన్లైన్ గ్రూప్ ద్వారా తనకు మద్దతు కూడకట్టుకుంటున్నారన్నారు. అందుకంటూ ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఆ గ్రూప్లో విజయ్ కూడా ఉన్నారని చెప్పారు. అంతా నాటకం అని, ఏ రాజకీయ నాయకుడూ చేయనిది బుషీ ఆనంద్ చేస్తున్నారని అన్నారు. అభిమాన సంఘానికి వచ్చే బుషీ ఆనంద్ అలసిపోయి అక్కడ ఉన్న టేబుల్పై పడుకుంటారని, దాన్ని ఒక వ్యక్తి పొటో తీసి ఆన్లైన్ గ్రూప్లో పొందుపరుస్తాడని చెప్పారు. దాన్ని మరో 50 మంది షేర్ చేస్తారన్నారని, మరో 100 మందితో లైక్ చేయిస్తారని ఇదంతా నాటకం అని అన్నారు. ఇదంతా చూసిన విజయ్, బుషీ ఆనంద్ తన కోసం రంగంలోకి దిగి ఇలా కింద కూడా కూర్చొంటున్నారని, ఆయన గురించి చాలా గొప్పగా భావించి అన్నా.. రేపటి నుంచి మీరు తనతో ఉండండి అని చెప్పారన్నారు. ఇదే జరిగిందని, ఇలాంటి వారు పక్కన ఉంటే విజయ్ భవిష్యత్ ఏమైపోతుందోనన్న భయం కలుగుతోందని దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్స్టార్ అజిత్తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
విజయ్ సినిమాకే ఇలాంటి సమస్యలు వస్తాయా..?
నటుడు విజయ్ నటించిన చిత్రాలకు విడుదల సమయంలో సమస్యలు రావడం చాలా కాలంగా జరుగుతోంది. అలా ఈయన నటించిన తలైవా, కత్తి వంటి చిత్రాలు అసలు తెరపైకి వస్తాయా? అన్నంతగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇటీవల విడుదలైన లియో చిత్రంలోని నా రెడీయా మరవా అనే పాటపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అలాంటి సమస్య విజయ్ చిత్రాలకు ఇప్పటికీ వదలా బొమ్మాళీ అంటునే ఉంది. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైం). వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటుడు ప్రభుదేవా, ప్రశాంత్, మైక్మోహన్, అజ్మల్, యోగిబాబు, నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. కాగా తాజాగా చిత్రంలోని విజిల్ పోడు అనే పల్లవితో సాగే పాటను విడుదల చేశారు. నటుడు విజయ్ పాడిన ఈ పాటలో ఆయనతో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ తదితరులు నటించారు. అసలు విషయం ఏమిటంటే ఈ పాట మద్యం తాగడం, పొగ తాగాడం వంటి అలవాట్లను ప్రోత్సహించేలా ఉందంటూ ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా చైన్నె డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై డీఐజీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో? అనే చర్చ జరుగుతోంది. మరోపక్క నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో పాటు పార్టీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement