-
BAN vs SL, 2nd Test: బంగ్లాదేశ్ను ఊడ్చేసిన శ్రీలంక.. రెండో టెస్ట్లో ఘన విజయం
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో శ్రీలంక.. బంగ్లాదేశ్ను వారి సొంత దేశంలో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (ఏప్రిల్ 3) ముగిసిన రెండో టెస్ట్లో పర్యాటక జట్టు 192 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 122.33 సగటున రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 367 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 531 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు లంక ఆటగాళ్లు అర్దసెంచరీలు చేశారు. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకుండా టెస్ట్ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు విజృంభించడంతో 178 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ (54) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్ది ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ఏంజెలో మాథ్యూస్ (56) టాప్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. ఖలీద్ అహ్మద్ 2, షకీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లోలా కాకుండా అద్భుతంగా పోరాడింది. బంగ్లా బ్యాటర్లు తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్లో 318 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (50), మెహిది హసన్ మీరజ్ (81 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లహీరు కుమార 4, కమిందు మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్పూర్కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
Ind vs Aus 2024: పెర్త్లో తొలి టెస్టు!
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్లో మొదలయ్యే ఈ సిరీస్లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్లో... మూడో టెస్టు బ్రిస్బేన్లో... నాలుగో టెస్టు మెల్బోర్న్లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్లో జరిగే రెండో టెస్టు డే–నైట్గా జరుగుతుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్కోట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్తక్తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం? -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
NZ vs AUS 2nd Test: ఆసీస్ అద్భుతం
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్స్వీప్ చేసింది. అలెక్స్ క్యారీ (98 నాటౌట్; 15 ఫోర్లు), మిచెల్ మార్ష్ (80; 10 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ పోరాటంతో రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై గెలిచింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆసీస్ 80 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆసీస్ కు పరాజయం ఖాయమనిపించింది. కానీ మార్ష్ , క్యారీ ఆరో వికెట్కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. 220 స్కోరు వద్ద మార్ష్ ని్రష్కమించినా, స్టార్క్ (0) డకౌటైనా... కెపె్టన్ కమిన్స్ (32 నాటౌట్; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 61 పరుగులు జోడించి ఆసీస్ను గెలిపించారు. 2005 నుంచి కివీస్ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది. -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
‘బజ్బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్కోట్లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్లో ఎటాక్లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024 -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ క్లీన్ స్వీప్
టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్ ఔట్ కావడంతో మ్యాచ్ కాస్త కివీస్ వైపు మలుపు తిరిగింది. కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ, కెప్టెన్ కమ్మిన్స్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మాట్ హెన్రీ రెండు, టిమ్ సౌథీ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసిన కివీస్.. ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ -
ధోని, యువీ కాదు..! భారత్లో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. సిక్సర్లు బాదడంలో హిట్మ్యాన్ తనకు తానే సాటి అని కొనియాడాడు. భారత్లో ఇంత వరకు అలాంటి హిట్టర్ మరొకరు లేరని పేర్కొన్నాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు చేశాడు. ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ‘హిట్టే’! ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి అతడి ఖాతాలో 597 సిక్స్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ టెస్టులో కూడా టీమిండియా గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రోహిత్ హిట్టింగ్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా వాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు(నవ్వుతూ).. జోక్స్ పక్కన పెడితే.. ఈ ఫార్మాట్లో ఎవరైనా సిక్స్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. మనకు రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హిట్టర్ ఉన్నాడు. షాట్ బాదడంలో తన పవర్, నైపుణ్యం అద్భుతం’’ అని కితాబులిచ్చాడు. టీమిండియాలో ఇంతవరకు అతడిలా సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్ జియో సినిమా షోలో ఈమేరకు వ్యాఖ్యానించాడు. కాగా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్ హిట్టర్లుగా పేరొందిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రసవత్తరంగా కివీస్-ఆసీస్ రెండో టెస్టు..
క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
ఎందుకంత మిడిసిపడుతున్నావు?.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్స్టో.. 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది. Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z — Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా జానీ బెయిర్స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’. శుబ్మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’. జానీ బెయిర్స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’. ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’ సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు. ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
బీసీసీఐ సంచలనం.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు
టెస్టు క్రికెట్ ప్రాధాన్యం పెంచేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాడు. పురుషుల సీనియర్ జట్టులో భాగమైన క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు. ఆటగాళ్లను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు.. వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా పేర్కొన్నాడు. 2022-23 సీజన్ నుంచి టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును అమలు చేస్తామని.. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు ఇదొక అదనపు రివార్డు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 45 లక్షలు ఒక సీజన్లో టీమిండియా షెడ్యూల్లో తొమ్మిది టెస్టులు ఉన్నాయనకుంటే.. ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్ ఉండవు. అయితే, 5-6 మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే 30 లక్షల చొప్పున.. బెంచ్కే పరిమితం అయితే 15 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారు. అదే విధంగా.. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే రూ. 45 లక్షలు, బెంచ్కే పరిమితం కావాల్సి వస్తే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. టీమిండియా విజయం తర్వాత ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం తర్వాత జై షా ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. బజ్బాల్ అంటూ ఇంగ్లండ్ అలా.. బీసీసీఐ ఇలా బజ్బాల్ అంటూ సంప్రదాయ క్రికెట్ రూపురేఖల్నే మార్చేలా ఇంగ్లండ్ దూకుడైన ఆట తీరుతో ముందుకు సాగుతుంటే.. బీసీసీఐ మాత్రం ఈ ఫార్మాట్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు కచ్చితంగా రంజీలో ఆడాలంటూ నిబంధన విధించిన బోర్డు.. ఆదేశాలను ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టెస్టు క్రికెట్కు తాము పెద్దపీట వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మేరకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: IND Vs ENG 5th Test: అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే I am pleased to announce the initiation of the 'Test Cricket Incentive Scheme' for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the 'Test Cricket Incentive Scheme' will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk — Jay Shah (@JayShah) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే
IND vs ENG, 5th Test, Day 3- Rohit Sharma: ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బజ్బాల్ అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్ను ముగించేసి సిరీస్ను 4-1తో గెలిచింది. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. ఇందుకు గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో మైదానంలో దిగలేదని తెలిపింది. కాగా నొప్పి తీవ్రతరమైతే హిట్మ్యాన్ కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధర్మశాల టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతడు 103 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. యువ జట్టుతో రోహిత్ శర్మ ఇంగ్లండ్తో సిరీస్ను 4-1తో గెలవడం విశేషం. ఇక ఐదో టెస్టులో టీమిండియా గెలిచిన అనంతరం సెలబ్రేషన్స్ సమయంలో రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. జట్టును అభినందిస్తూ సంతోషం పంచుకున్నాడు. UPDATE: Captain Rohit Sharma has not taken the field on Day 3 due to a stiff back.#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్లపై ‘బజ్బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్ను కుప్పకూల్చాడు. శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్. ఓవరాల్గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్ను అవుట్ చేసి ఐదో వికెట్ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800 షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708 జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700* అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, దేవ్దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
ధనాధన్ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్పై మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తాజా సిరీస్లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. Wood's got pace? Sarfaraz has the answer 😎#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSport pic.twitter.com/htRkcp57X1 — JioCinema (@JioCinema) March 8, 2024 చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్ తండ్రి -
అలా చేయడం ముమ్మాటికి తప్పే: గిల్పై తండ్రి విమర్శలు
India vs England, 5th Test Day 2: టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి అతడి తండ్రి, చిన్ననాటి కోచ్ లఖ్విందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఓపెనర్గా కాకుండా.. వన్డౌన్లో ఆడాలనుకున్న గిల్ నిర్ణయం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. కాగా అండర్ 19 వరల్డ్కప్లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టిన పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్.. ఓపెనర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ జోడీగా జట్టులో పాతుకుపోయాడు. అయితే, ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం నేపథ్యంలో శుబ్మన్ గిల్ మూడోస్థానానికి డిమోట్ అయ్యాడు. ఛతేశ్వర్ పుజారా స్థానంలో వన్డౌన్లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. కొత్త పాత్రలో ఒదిగేక్రమంలో ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వరుసగా 10 ఇన్నింగ్స్పాటు ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు గిల్. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా వన్డౌన్లో బ్యాటింగ్ చేసేందుకు అలవాటు పడ్డాడు. తాజాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టెస్టులో శతకంతో సత్తా చాటిన గిల్.. ధర్మశాలలోనూ సెంచరీ(110)తో చెలరేగాడు. స్టోక్స్ బృందంతో జరుగుతున్న నామమాత్రపు ఐదో టెస్టులో రోహిత్తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు గిల్ తండ్రి లఖ్విందర్ ధర్మశాలకు విచ్చేశాడు. ఈ సందర్భంగా పుత్రోత్సాహంతో పొంగిపోతూనే.. అతడి ఆట తీరుపై విమర్శలు చేశాడు. ‘‘తను ఓపెనర్గానే కొనసాగాల్సింది. వన్డౌన్లో ఆడటం సరైన నిర్ణయం కానేకాదు. డ్రెసింగ్రూంలో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే.. అంతగా ఒత్తిడి పెరుగుతుంది. నంబర్ 3 అనేది ఓపెనింగ్ స్థానమూ కాదు.. అలాగని మిడిలార్డరూ కాదు. కాబట్టి సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఏదేమైనా తనదైన సహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా అనుకున్న ఫలితాలను రాబట్టగలడు. అయినా.. తన నిర్ణయాలలో నేను జోక్యం చేసుకోను. కేవలం తనకు శిక్షణ ఇవ్వడం వరకు నా బాధ్యత. తనిప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోగల పెద్దవాడై పోయాడు. తను టీనేజర్గా ఉన్నపుడు మాత్రమే తన తరఫున నేను నిర్ణయాలు తీసుకునేవాడిని’’ అని లఖ్విందర్ సింగ్ తెలిపాడు. Apni ballebaazi se jeete har dil, kamaal khele Shubman Gill 💯🫶#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/VBpIakUekG — JioCinema (@JioCinema) March 8, 2024 -
అదెట్లా అవుట్.. కానేకాదన్న రోహిత్! అంపైర్దే తప్పు!
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు.. భారత ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ను ఇంగ్లిష్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని.. షార్ట్ లెంగ్త్ బాల్గా సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సరిగ్గానే అంచనా వేసి దానిని మిస్ చేశాడు. అయితే, బాల్ రోహిత్ కుడికాలి ప్యాడ్ను రాసుకుంటూ వెళ్లి కీపర్కు చిక్కింది. కానీ.. ఇంగ్లండ్ మాత్రం క్యాచ్ అవుట్కు అప్పీలు చేసింది. అయితే, అనూహ్యంగా అంపైర్ జోయెల్ విల్సన్ రోహిత్ శర్మను అవుట్గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న హిట్మ్యాన్ వెంటనే రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. బంతి బ్యాట్ను తాకలేదని రీప్లేలో స్పష్టంగా తేలడంతో థర్డ్ అంపైర్ రోహిత్ శర్మను నాటౌట్గా ప్రకటించాడు. Rohit reminding of Ben stokes to ICC elite umpire Joel Wilson, #INDvENG pic.twitter.com/COcitjOyW8 — That_Lazy_Guy 😴 (@Slow_low_) March 7, 2024 ధర్మశాల వేదికగా గురువారం నాటి తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో ఫీల్డ్ అంపైర్ తనను అవుట్గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నట్లుగా రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఇందులో రోహిత్ ప్రదర్శించిన హావభావాలకు నెటిజన్లు తమదైన శైలిలో భాష్యాలు చెబుతున్నారు. ‘‘అదెట్లా అవుట్ అంపైర్ జీ.. కానేకాదు! ముందే చెప్పానుగా!.. అన్నట్లు హిట్మ్యాన్ నవ్వుతూనే.. సెటైరికల్గా ఓ చూపు చూశాడు. నిజంగా రోహిత్ సూపర్ కదా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ శతకం(103) పూర్తి చేసుకున్నాడు. అతడికి టెస్టుల్లో ఇది 12వది కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 48వది. చదవండి: స్టోక్స్ ‘మ్యాజిక్’ బాల్.. రోహిత్ క్లీన్బౌల్డ్!.. ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్ The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️ Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm — JioCinema (@JioCinema) March 8, 2024 -
రోహిత్ అవుటా? నిజమేనా..? ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డౌన్ బ్యాటర్, శతక వీరుడు శుబ్మన్ గిల్తో కలిసి రెండో వికెట్కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో.. 135/1 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. రోహిత్ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్రౌండర్ స్టోక్స్.. ‘మ్యాజిక్’ బాల్తో హిట్మ్యాన్ను పెవిలియన్కు పంపాడు. స్టోక్స్ సంధించిన గుడ్లెంగ్త్ బాల్ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. బ్యాట్ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ అవాక్కు కాగా.. ఇంగ్లండ్ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐపాడ్లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్లో ఉన్న పేసర్ మార్క్ వుడ్ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రోహిత్ శర్మ అవుటైన మరుసటి ఓవర్(63)లోనే శుబ్మన్ గిల్(110) కూడా పెవిలియన్ చేరాడు. జేమ్ ఆండర్సన్ వికెట్ల ఖాతాలో 699వ వికెట్గా వెనుదిరిగాడు. 𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl — JioCinema (@JioCinema) March 8, 2024
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య
శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది: అల్లు అర్జున్
ఏపీ ఎన్నికలు 2024: ఓటేసిన రాజకీయ ప్రముఖులు, అధికారులు (ఫొటోలు)
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
కుప్పంలో విజయం నాదే
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
తప్పక చదవండి
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement