-
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
నిరుద్యోగ యువత ఆకాంక్ష నెరవేరేనా!
తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధాన అంశాలుగా ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 1,200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమీప భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదనీ, నూతన రాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయనీ భావించిన నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యాయి. మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఉద్యోగ నియామకాల ఊసు లేకపోవడంతో 2015లో నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటీ అరా ఉద్యోగ ప్రకటనలు వచ్చినా అనేక మంది ఉద్యమకారులకు పరీక్షలకు హాజరవ్వడానికి వయసు మీరిపోయింది. అర్హత ఉన్న చాలా మంది సీనియర్లకు నవ యువకులతో పోటీపడే శక్తి లేకుండా పోయింది. అదే సమయంలో ఉద్యోగ నియామకా లపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతలో కొత్త ప్రభుత్వం మొదటి టెర్మ్ ముగిసిపోయింది. 2018లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారన్నా తమకు ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు భావించారు. ఇంతలో కరోనా విజృంభించింది. దాని కోరల నుంచి బయటపడి గ్రూప్ వన్ పరీక్షకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులను పేపర్ లీకేజ్ వ్యవహారం కుంగదీసింది. అప్పటినుంచి నిరు ద్యోగులు చదవడం మానేసి తమకు జరిగిన అన్యా యాన్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. అదే సమయంలో ఉద్యోగం రాలేదని బాధతో ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక విద్యార్థిని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడారు అధికారంలో ఉన్నవారు. అటువంటి అహంకార ధోరణిని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోయారు. అప్పటివరకు రాజకీయ ప్రక్రియలో చురుకుగా పాల్గొనని నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కసారిగా రాజకీయాలను మార్పు చేయాలనీ, తమ తలరాతను తామే మార్చుకోవాలనీ భావించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాధారణ ఎన్ని కల్లో ప్రభావాన్ని చూపించారు. 2023 జూన్ కంటే ముందు తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే నాయకులను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి పరిస్థితులలో గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశం ప్రతిపక్ష పార్టీలకు ప్రధానఅస్త్రంగా మారింది. అప్పటినుంచి రాష్ట్రంలో రాజ కీయ సమీకరణలు మారినాయి. అన్ని పార్టీలు నిరు ద్యోగ సమస్యని తమ ప్రధాన ఎజెండాగా కార్యా చరణ రూపొందించడం ప్రారంభించాయి. ఈ నిరు ద్యోగ ఉద్యోగ సమస్యలు ఈనాడు కాంగ్రెస్ ప్రభు త్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చాయి అనడంలో అతిశయోక్తి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అధికార పార్టీ చాలా అంశాలను ప్రస్తావించింది కాని, నిరుద్యోగులకూ, ఉద్యోగులకూ భరోసా కల్పించే విధంగా ఏ వాగ్దానాలు చేయలేదు. అందు వలన ఎక్కడెక్కడో చదువుకొనే చాలామంది నిరు ద్యోగులూ, చిరుద్యోగులూ తమ తమ గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాలలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారికీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికీ... తమ వాదాన్నీ, బాధనూ అర్థమయ్యేలా చెప్పు కున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయమని అర్థించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రజానీకానికి తెలి యచేయడానికి శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. ఒక సాధారణ వెనుక బడిన తరగతికి చెందిన యువతికి సపోర్ట్ చేయడా నికి విదేశాల నుంచి కూడా కొందరు రావడం, మన రాష్ట్రంలోని చాలామంది ప్రముఖులు ఆమెకు మద్దతు ప్రకటించడం మనం గమనించాం. నిరు ద్యోగ సమస్య ఎజెండాగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి హేమాహేమీ నాయకులకు చెమటలు పట్టించిందామె. కాబట్టి పార్టీలు ఈ అంశాన్ని ఒక గుణపాఠంగా భావించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం, జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని భరోసా కల్పించడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించారు. పార్టీలో గెలిచినటువంటి 64 మంది అభ్యర్థుల మెజారిటీని మనం గమనిస్తే ఎక్కువమంది సుమారు 20 వేల నుంచి 65 వేల మధ్య మెజారిటీ సాధించినవారే కనిపిస్తారు. ఇందుకు కారణం నిరుద్యోగ యువతే అని చెప్పవచ్చు. నూతన ప్రభుత్వమైనా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని ఆశిద్దాం. -వ్యాసకర్త రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు మొబైల్: 99514 50009 - డా‘‘ ఎ. శంకర్ -
తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా పేర్లు పెట్టారు. 12 జోన్లు.. 48 సర్కిళ్లు.. పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్ జోన్ షేక్పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. గతంలో ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని 12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో జారీ చేశారు. ఆమేరకు కమిషనర్ను ఆదేశించారు. కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ బాధ్యతలు కమిషనర్కు.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్ జిల్లాది మాత్రం కమిషనర్కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది. -
18న ములుగులో సభ.. 19న భూపాలపల్లిలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు దశల్లో బస్సు యాత్ర ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement