-
మూకదాడులపై చట్టమా?
మూక దాడుల్ని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం పార్లమెంటుకు సూచించిన కొన్ని గంటల్లోనే జార్ఖండ్ రాష్ట్రంలో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్పై బీజేపీ అనుబంధ సంస్థ యువమోర్చా కార్యకర్తలమని చెప్పుకున్నవారు మంగళవారం దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. ఇటువంటి దాడులు జరిగి నప్పుడల్లా ఆ మూకలోని వారు చెప్పే కారణాలనే వల్లెవేస్తూ వాటికొక సాధికారత కల్పించడానికి బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ప్రయత్నించే సంస్కృతి పెరుగుతున్నప్పుడూ... ఈ కేసుల్లో బెయిల్పై విడుదలైనవారిని ఏదో ఘనకార్యం చేసినవారిగా పరిగణించి కేంద్రమంత్రులే దండలేసి స్వాగతిస్తున్నప్పుడూ ఈ మాదిరి దాడులు పెరగడంలో వింతేమీ లేదు. నిజానికి అలా జరగక పోతేనే ఆశ్చర్యపోవాలి. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, తమ చర్యలే చట్టమన్నట్టు వ్యవహరించకూడదని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు సూచించినట్టు మన పార్లమెంటు మూక దాడులపై చట్టం చేస్తుందా లేదా అన్న సంగతలా ఉంచి... అసలు చట్టాలు మాత్రమే దాడుల్ని నిరోధించగలవా అన్న సంశయం ఎవరికైనా ఏర్పడితే వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అసమర్ధ ప్రభుత్వాలు ఉన్నవాటినే సరిగా అమలు చేయలేకపోవడం లేదా దుర్వినియోగం చేయడం రివాజుగా మారింది. అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం మాత్రం ఎన్నదగినది. దేశంలో మూకస్వామ్యం కొత్త నియమంగా మారినట్టు కనబడుతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత రెండు మూడేళ్లుగా దేశంలో కొనసాగుతున్న పరిస్థితికి ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది. ఇవే మాటలు అన్నవారిని బీజేపీ నాయకులు గతంలో రకరకాలుగా దుయ్యబట్టారు. అసహనం పెరుగుతున్నదని అన్నందుకు పాకిస్తాన్కు పొమ్మనడం దగ్గరనుంచి జాతి వ్యతిరేకులు అనడం వరకూ ఎన్నోవిధాల నిందించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమంటే దేశాన్ని విమర్శించ డమే అన్నంత విపరీత ధోరణిని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధోరణులకు అడ్డుకట్ట పడలేదు. ఈ వాతావరణం ఉన్నప్పుడు మూక దాడులు కొత్త నియమంగా మారినట్టు కనబడటంలో వింతేముంది? గోరక్షణ, పశుమాంసం దగ్గ రుంచుకోవటం వంటి ఆరోపణలతో జరిగే దాడులు ఇంకా ఆగకుండానే... దొంగలన్న పేరుతో, పిల్లల్ని ఎత్తుకుపోయేవారన్న పేరుతో పలువురిపై వివిధచోట్ల మూకలు విరుచుకుపడుతున్నాయి. స్వామి అగ్నివేష్ దేశంలోనూ, వెలుపలా అందరికీ తెలిసిన ఉద్యమకారుడు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఆయన 1979లో హర్యానాలో దేవీలాల్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. అటు తర్వాత ఆయన ఎన్నికల రాజకీయాలనుంచి తప్పుకుని వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్మించారు. వెట్టి కార్మికుల విముక్తి కోసం బంధువా ముక్తి మోర్చా సంస్థ స్థాపించి పోరాడారు. ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలతో విభేదించడంలో తప్పులేదు. ఇప్పుడు దాడికి పాల్పడిన మూక ఆయన హిందువులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు నిరసన తెలియజేయవచ్చు లేదా కేసులు పెట్టవచ్చు. అంతేతప్ప 79 ఏళ్ల వయసు వ్యక్తిపై కిరాతకంగా దాడికి పూనుకోవటం, కిందపడేసి గాయపర్చటం, నోటికొచ్చిన దుర్భాషలాడటం ఎలాంటి సంస్కృతి? దాడి చేసినవారు తమ సంస్థవారో కాదో చెప్పలేనని యువమోర్చా జార్ఖండ్ అధ్యక్షుడు అంటున్నారు. జార్ఖండ్లోని పకూర్లో ఈ దాడి జరగడానికి ముందు ఆ రాష్ట్రంలోని పహాడియా తెగ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విలేకరులతో అగ్నివేష్ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఆదివాసీలకు కనీస వేతనం కూడా దక్కడం లేదని, చట్ట ప్రకారం ఏడాదికి వంద రోజుల పని కాకుండా 42–43 రోజులే ఉపాధి కల్పిస్తున్నారని ఆరోపించారు. వీటికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం ఉందో తెలియదు. ఇంతటి అన్యాయమైన స్థితిలో మగ్గుతున్నప్పుడు ఆ ఆదివాసీలు నక్సలైట్లనో, మరొకరినో ఆశ్రయించడంలో వింతేముంది? మన దేశంలో మూకదాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టమేదీ లేదు. అయితే మూక పాల్పడే వివిధ నేరాలకు విధించే శిక్షల గురించి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో ఉంది. ఒక బృందం నేరానికి పాల్పడినప్పుడు ఆ బృందంలోని సభ్యులందరినీ ఉమ్మడిగా ఆ నేరంపై విచారించాలని నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లోని సెక్షన్ 223 నిర్దేశిస్తోంది. అలాగే భిన్నరూపాల్లోని విద్వేషపూరిత హింసను అరికట్టేందుకు మరికొన్ని చట్టాలున్నాయి. దళితులు, ఆదివాసీలపై జరిగే నేరాల నియం త్రణకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల(నిరోధక) చట్టం ఉంది. కానీ విషాదమేమంటే ఈ చట్టాలేవీ జరుగుతున్న నేరాలను నిరోధించలేకపోతున్నాయి. దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న నేరా లతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల(నిరోధక) చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువన్న ఆరోపణ ఒకపక్క వినబడుతుండగా... ఈ చట్టంకింద నిందితులకు పడే శిక్షల శాతం అతి తక్కువగా ఉంటున్నది. నేరాలకు పాల్పడినవారు డబ్బు, పలుకుబడి ఉన్నవారైతే బాధితులు చెప్పినా వారి పేర్లు ఎఫ్ఐఆర్లలో నమోదు కావు. ఇలాంటి పరిస్థితుల్లో మూక దాడులపై చట్టం తెచ్చినా అది సక్రమంగా అమలవుతుందన్న గ్యారెంటీ ఉందా? ఈ చట్టంకన్నా ముందు ఈ దాడులు సమాజాన్ని ఎంత అమానవీయంగా మారుస్తాయో... విద్వేషాలను పురిగొల్పి సమాజా న్నెలా చీలుస్తాయో చైతన్యం కలగజేయడం చాలా అవసరం. చట్టమంటూ తీసుకొస్తే మూకదాడుల విషయంలో ఉద్దేశపూర్వకంగా నిర్లిప్తత పాటిస్తున్న అధికారులను కఠినంగా శిక్షించే నిబంధనలు పొందుపరచడం ముఖ్యం. అంతేకాదు... ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారినైనా ఆ చట్టం విడిచి పెట్టదన్న భావన కలిగితేనే ఫలితం సిద్ధిస్తుంది. లేదంటే ఇప్పుడున్న సవాలక్ష చట్టాల్లో అదొకటవు తుంది. కాగితాలకు పరిమితమవుతుంది. -
సమరానికి సై
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో మూడున్నరేళ్ల ప్రత్యేక అధికారుల పాలనకు త్వరలో తెరపడనుంది. సుదీర్ఘ కా లంగా ఊరించిన మున్సిపల్ ఎన్నికలు సుప్రీం కోర్టు జోక్యంతో ఉన్న ఫలంగా షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకటించిన మరు క్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోల్-జోగిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేగుంట నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటీ, దుబ్బాక, చేగుంట నగర పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులున్నందున ఇక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. తమ గ్రామాలను అక్రమంగా నగర పంచాయతీలో కలిపారని ఆయా గ్రామాల వారు కోర్టులను ఆశ్రయించిన విషయం తెల్సిందే. కోర్టు తీర్పు వెలువడిన తరువాత సదరు ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలకు, అందోల్-జోగిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరుగుతాయి. వార్డుల వారీగా రిజ ర్వేషన్లను గత ఏడాది ఆగస్టు నెలలో ప్రకటిం చగా చైర్ పర్సన్ పదవుల రిజర్వేషన్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్నికల షెడ్యూల్పై హర్షం.. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం తరువాతనైనా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇక కొత్త పాలక వర్గాల ద్వారా తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నారు. 2010 సెప్టెంబర్తో మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. నాటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. దీంతో పలుమార్లు ఎన్నికలు నిర్వహించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో దిగివచ్చిన ఉన్నతాధికారులు ఎన్నికలకు సన్నద్ధం కావడంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు... మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్లు (ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3 వరకు మార్చి 15న నామినేషన్ల పరిశీలన ( ఉదయం 11.00 నుంచి) మార్చి 18 వరకు నామినేషన్ల ఉపసంహరణ (మధ్యాహ్నం 3గంటల లోపు) మార్చి 30న పోలింగ్ (ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకు) ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ( ఉదయం 8 నుంచి మొదలు) -
వ్యక్తిగత విమర్శలు వద్దు: కేంద్ర ఎన్నికల కమిషన్
పార్టీలకు ఈసీ ఎన్నికల నియమావళి సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు... పార్టీ నేతలపై వ్యక్తిగత, ప్రైవేట్ జీవితాలపై విమర్శలు, ఆరోపణలు చేయరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని, ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసే హామీలను ఇవ్వరాదని నిర్దేశించింది. ఇటీవల ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈసీ పార్టీలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు చేసింది. కొత్త నియమావళిని పార్టీలన్నింటికి పంపింది. దీని ప్రకారం... - ఏ పార్టీ వ్యక్తి అయినా మరో పార్టీ వ్యక్తిని జాతి, మతం, కులం ఆధారంగా మనసు గాయపరిచేలా, అవమానపరిచేలా విమర్శలు చేయరాదు. - పార్టీల నేతలు విధానాలు, కార్యక్రమాల ఆధారంగానే విమర్శలు చేయాలి. - ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ప్రచారాలు నిర్వహించరాదు. మసీదు, చర్చి, ఆలయాలను ప్రచారాలకు వినియోగించకూడదు. - వ్యక్తుల ఇళ్లలో ప్రశాంత జీవనానికి విఘాతం కలిగేలా పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ రాజకీయ కార్యకలాపాలను, ధర్నాలను చేపట్టరాదు. - ఇచ్చే హామీలకు ఎన్ని నిధులు అవసరమో తెలపాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement