-
ప్రేమ విఫలమైందని.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
Hyderabad: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..
సాక్షి, మియాపూర్: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్(28) పటాన్చెరులోని శ్రీనగర్కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న చందానగర్లోని ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్లో ఓ సూసైడ్ నోట్ను గుర్తించారు. అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పృథ్వీ షా లవ్స్టోరీకి ఎండ్కార్డ్ పడిందా!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా లవ్స్టోరీకి ఎండ్కార్డ్ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పృథ్వీ షా నిధి తపాడియా అనే అమ్మాయితో లవ్లో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు తమ రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇటీవలే నిధి తపాడియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకుంది. పంజాబీ నేపథ్యంలో ఉన్న బ్రేకప్ పాటను షేర్ చేసుకుంది. ఆ తర్వాత పృథ్వీ షా, నిధి తపాడియాలు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడం బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నిధి తపాడియా మోడల్, నటిగా రాణిస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 108కె ఫాలోవర్లు ఉన్నారు. నిధి తపాడియా స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్. కాగా ఇటీవలే ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్గా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. ఈ ఇద్దరు ఇలా తమ లవ్ను బ్రేక్ చేసుకోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు, పబ్లకు వెళ్లారు. పృథ్వీ షా ప్రేమలో ఉన్నాడని తెలిసేలోపే ఇద్దరి మధ్య రిలేషిన్షిప్కు బ్రేక్ పడింది. ఇక పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్తో టి20 సిరీస్లో ఆడుతున్నాడు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చినప్పటికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.మూడో టి20కి వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సహా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsxhmemewala🔵 (@harsxhmemewala) చదవండి: బట్లర్కు ఇదేమి కొత్త కాదు.. -
ఆమె వల్ల పిచ్చోడినయ్యా.. ప్లీజ్ వారినైనా కాపాడండి: బీటెక్ విద్యార్థి సూసైడ్
సాక్షి, విజయవాడ: సూసైడ్ నోట్ రాసిపెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్ పాస్ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement