-
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేస్తామని పాక్ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్కప్ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. జట్ల ప్రకటనకు మే 24 డెడ్లైన్ కావడంతో ఆలోపే తమ వరల్డ్కప్ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్ ఐర్లాండ్ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం పాక్ ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన అనంతరం పాక్ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్ వేదికకు బయల్దేరుతుంది. టీ20 వరల్డ్కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్ ప్రయాణం జూన్ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్ ఆతిథ్య యూఎస్ఏతో తలపడనుంది. డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్లో పాక్.. భారత్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.పాక్ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్ హసన్ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అఘా సల్మాన్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న హరీస్ రౌఫ్, ఆజమ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్ ఉసామా మీర్, పేసర్ జమాన్ ఖాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్ -
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్ కౌంటీ (గ్లోసెస్టర్షైర్) క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్కు వీడ్కోలు పలికాడు.వెల్స్ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.శారీరక శ్రమ లేకుండా క్రికెట్ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్ అర్దంతరంగా ముగియడంతో వెల్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్ కౌంటీ జట్టు గ్లోసెస్టర్షైర్ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వికెట్కీపర్ బ్యాటర్ అయిన వెల్స్.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్లో ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-ఏ మ్యాచ్లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్ ఇటీవలే లిస్ట్-ఏ ఫార్మాట్లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్ వన్డే కప్లో భాగంగా డర్హమ్తో జరిగిన మ్యాచ్లో వెల్స్ ఈ సెంచరీ చేశాడు. వెల్స్కు లిస్ట్-ఏ కెరీర్లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్ టేలర్ కూడా వెల్స్ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. -
టీమిండియాకు నో ఛాన్స్.. వరల్డ్కప్ సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే: మైఖేల్ వాన్
టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్కప్పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈసారి సెమీఫైనల్స్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్ ఫోర్కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వాన్కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్కప్ సెమీఫైనలిస్ట్లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్కప్లో టఫ్ ఫైట్ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు సెమీఫైనల్కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ కోసం న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండ, వెస్టిండీస్, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాలు తమ వరల్డ్కప్ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ టి20 జట్టులో జోఫ్రా ఆర్చర్
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్ జట్లకు షాక్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.పాక్తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్తో సిరీస్ కోసమని ఐపీఎల్కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టు సభ్యులు..జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)మొయిన్ అలీ (సీఎస్కే)బెయిర్స్టో (పంజాబ్)సామ్ కర్రన్ (పంజాబ్)లివింగ్స్టోన్ (పంజాబ్)విల్ జాక్స్ (ఆర్సీబీ)ఫిల్ సాల్ట్ (కేకేఆర్)రీస్ టాప్లే (ఆర్సీబీ)ఐపీఎల్ ప్లే ఆఫ్స్..మే 21: క్వాలిఫయర్-1మే 22: ఎలిమినేటర్మే 24: క్వాలిఫయర్-2మే 26: ఫైనల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement