-
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్ను సూపర్సీఎంగా పిలుస్తాయి. -
ఈసీ షాక్..కుదేలైన కూటమి..
-
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్చైర్కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా గుప్పిట పెట్టుకుని ఆడిస్తోందని.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధంతో ఎన్నికల కమిషన్ వైఖరి బయటపడిందని విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైషమ్యాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను తిడుతూ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ విషం చిమ్ముతోంది. బీజేపీ కాకుండా ఇతరులు అధికారంలోకి వస్తే.. సంపదను ఎక్కువ పిల్లలున్న ముస్లింలకు దోచిపెడతారంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఆ వ్యాఖ్యలపై 20వేల మందికిపైగా పౌరులు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేక.. మోదీకి బదులుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో దేవుడు, మతాన్ని ప్రస్తావించడం నేరమని తెలిసీ.. అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు శ్రీరాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. అయినా వారికి నోటీసులు, చర్యలు లేవు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు ఈసీకి కనిపించడం లేదు. కేసీఆర్పై రాకెట్ వేగంతో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే.. మోదీ, రేవంత్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వైఖరి ఉంది. ఒక పార్టీ, కొందరు నాయకులు ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మాటలేమైనా ప్రవచనాలా? ‘నిరోధ్లు, పాపడాలు అమ్ముకోండి..’అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల పాటు మాట్లాడకుండా గొంతు నొక్కారు. బీఆర్ఎస్ నుంచి సీఎం రేవంత్పై ఎనిమిది ఫిర్యాదులు.. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరుల వ్యాఖ్యలపై 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు. ఏప్రిల్ 10న తుక్కుగూడ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సుభాíÙతాలు, సూక్తుల్లా కనిపించాయా? రేవంత్ మాటలను ఉటంకించడానికి సంస్కారం అడ్డువస్తోంది. అలాంటి వ్యాఖ్యలపై ఈసీ చర్యలేవి? కూడబలుక్కుని నిషేధం పెట్టారు కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారనే వార్తలు, నిఘా సంస్థల నివేదికలు వారికి కంటగింపుగా మారాయి. బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తుండటం, జన స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. దీంతో బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్ కూడబలుక్కుని కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లకుండా నిషేధం పెట్టారు. ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించింది. కొందరిని మాత్రం ప్రజలు, ప్రత్యర్థుల మీదకు అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసింది.రేవంత్పై క్రిమినల్ కేసు పెట్టాలి హాస్టళ్ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గతేడాది ఇచ్చిన సర్క్యులర్, స్టాంప్ను ఫోర్జరీ చేసి ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేసిన సీఎం రేవంత్రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ఉస్మానియా వర్సిటీ చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దాంతో ఓయూ చీఫ్ వార్డెన్కు రిజి్రస్టార్, సదరన్ డిస్కం నుంచి నోటీసులు ఇప్పించారు. అంతటితో ఆగకుండా గత ఏడాది చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను రేవంత్ పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. రేవంత్ ఫోర్జరీ డాక్యుమెంట్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అని ఓయూ అధికారులు నిరూపిస్తే.. చంచల్గూడ జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. రేవంత్పై ఓయూ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్పై చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement